6, నవంబర్ 2013, బుధవారం

గయ

File:Vishnupad Temple- Rear side.JPG
గయలో విష్ణాలయం 

విష్ణాలయ గోపురం 
ఫల్గుణీ నది 
ఈ సారి మేము కాశీ గయ యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. జీవితంలో కాశీ యాత్ర చేయాలన్నది నా చిరకాల
వాంచ. ఎలాగో నా కోరిక తీరే
సమయం భగవంతుని కృప వలన
ఆసన్నమైంది. మొత్తం యాత్రా మార్గదర్శితో  కలిసి 13 మందిమి బయలుదేరాము.  మాకు మేమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. రైలు ప్రయాణంతో మొత్తం 13 రోజుకు. అంటే తిరిగి రెండవసారి ఢిల్లీ, ఆగ్రా, మథుర, గోకులం, బృందావనం చూసాము. రెండవసారి అయినప్పటికీ సరికొత్త ప్రదేశాల సందర్శన సరికొత్త అనుభవాలు కనుక అయా ఊర్లను నాతో తిరిగి సందర్శించబోతున్నారన్న మాట. ఎప్పటిలా చెన్నైలో రైలు ఎక్కి రెండు రోజులు ప్రయాణం చేసి రెండరోజు రాత్రికి గయ చేరుకున్నాము. గయ బుద్ధ గయ ఒక్కటే. గయలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పరమ ఉత్తమమని హిందూ ధర్మం భోదిస్తుంది. మూడు తరాలకు చెందిన పితరులు
తమ వంశములో ఎవరైనా గయాశ్రాద్ధం పెడతారని ఎదురుచూసిన తరువాత భగవంతుని ఆజ్ఞతో తిరిగి జన్మిస్తారని పురాణాలలో ప్రస్తావించబడింది. మేము అకాలానికి చెందిన వారం కనుక మాకా విశ్వాసం ఉంది కనుక మాయాత్రలో ప్రధానాంశం శ్రాద్ధ కర్మలు ఆచరించడమే.





విష్ణాలయ శిఖరం 




ముందుగా మీకు గయాసుర వృత్తాంతం గురించి వివరింకాలి కదా ! గయాసురుని వృత్తాతంతం ఇదే. పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని 
యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి 
పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు 
పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి 

విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
File:Footprints of Lord Vishnu.jpg
విష్ణుపాదం  
‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి 
పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి 
గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, 
“దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై 
వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను 
చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని 
ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.


మర్గలో ఒక ఆలయం 
గయలో కోనేరు 
గయలో మేము ముందుగా ఏర్పాటు చేసుకున్నట్లు పురోహితుని ఇంటికి చేరుకున్నాము. పురోహితుడు మాకు
విశ్రమించడానికి గదులను ఏర్పాటు చేసారు. మామా గదులలో విశ్రాంతి తీసుకుని ఉదయం అక్కడే స్నానాదులు పూర్తి చేసుకున్నము. గయలో ఉన్న ఫల్గుణీ నదిలో తగినన్ని నీరు ఉండదు కనుక స్నానాదులు  పురోహితుని
ఇంట్లో పూర్తి చేసుకున్నము.  ఉదయం అల్పాహారం వచ్చింది.  మాలో కొందరు మాత్రమే అల్పాహారం తీసుకున్నాము. మిగిలినవారపిండప్రదానం అయిన తరువాత ఒకేసారి భొజనం చేస్తామని చెప్పారు.


పురోహితుని ఇంతో గణేశపూజ 


పిలుపు కొరకు ఎదురుచూస్తూ కూర్చుని ఉన్న సమయంలో మాకు పురోహితుని పిలుపు వచ్చింది. అమదరం కిందకు దిగి పురోహితుడు ఉన్న చిన్నపాటి హాలులో ప్రవేశించాము. లోపల పురోహితుడు చిన్నపాటి దర్భారులా ఉంది. అయన ఒకవేదిక మీద ఆసీనుడయ్యాడు.
ఎదురుగా కూర్చోవడానికి చాపలాంటివి పరిచి ఉన్నాయి. ఒక వైపుగా గోడవారగా కొన్ని పరుపులు దిండ్లు వేసి
ఉన్నాయి. మేము పురోహితుని ముందు కూర్చోగానే అయన గయప్రాశస్థం గురించి అక్కడ శ్రాద్ధకర్మలను
ఆచరించడం వలన కలిగే ప్రయోజనం గురించి చెప్పి మాతో ఒక సహాయకుడిని జతచేసి ఆలయానికి పన్పాడు. ఆ హాలులో ఒక మూలగా ఉన్న పూజా మందిరంలో పురోహితుని సతీమణి వినాయకుని పూజ నిర్వహిస్తున్నారు. వినాయక చవితి తరువాత నిర్వహిస్తున్న పూజలవి. మేము వినాయకునికి నమస్కరించి సహాయకునితో
ఆలయానికి బయలుదేరాము. అక్కడి నుండి ఆటోలలో ఆలయప్రాంగణానికి చేరుకున్నాము

File:Vishnupad Temple- Riverview.JPG
ఆలయం నుండి ఫల్గుని నదికి పోయేదారి 

పిండప్రదానం 
File:Vishnupath Tempal.JPG
ఫల్గుని నదిలో మందిరం 
ముందుగా పురుషులు అందరికీ చెంబులు తీసుకు వచ్చి ఇచ్చారు. తరువాత అందరినీ ఆలయం సమీపంలో
ఉన్న ఫల్గుణి నదికి తీసుకు వెళ్ళారు. ఫల్గుణీ నదిలో జలాలు తక్కువగా ఉంటాయి. సీతాదేవి శాపం కారణంగా ఆ నదిలో ఎప్పుడూ జలం తక్కువగా ఉంటుందని క్షేత్ర పురాణ కథనాలు వివరిస్తున్నాయి. అందరం ఆ నదీజలాల్లో
కాళ్ళుకడుగుకుని చెంబులతో నీరు తీసుకుని పురోహితుడి వద్దకు వచ్చాము. పురోహితుని సహాయకులు
పురుషులకు శ్రాద్ధకర్మలకు అవసరమైన సామాను అందిచాడు. తరువాత పురోహితుడు మగవారిని వరుసగా కూర్చోమని చెప్పాడు. మగవారు అందరూ పురోహితుడి సలహా మీద యవలపిండితో మూడు శ్రాద్ధకర్మలకు అవసరమైన పిండాలను చేసారు. ఆ తరువాత పురోహితుడు గయగురించి గయాసురుడి వృత్తాతం పూర్తిగా
వివరించాడు. అక్కడ శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పితరులకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని వివరించాడు.

రెండవ మండపంలో పిండప్రదానం 
అక్షయ వటం 
ఆలయ ప్రాంగణంలో ఉన్న మరొక మందిరానికి చేరుకున్న తరువాత తిరిగి శ్రాద్ధకర్మలు కొనసాగాయి. ఇప్పుడూ రెండవ సారి పిండప్రధానం చేసారు. ఈ సారి పిండప్రధానంపూర్తి అయినతరువాత వాటిని అక్షయ వటవృక్షం వద్ద ఉంచి నమస్కరించమని చెప్పారు. అలాగే చేసి అందరం తిరిగి వచ్చాము. తిరిగి మూడవ విడత పిండప్రధానంచేయించారు. ఆ తరువాత పురోహితుడు మమ్ము విస్తరాకు, కూరగాయ, పండు వదలమని చెప్పాడు. ఆ మూడింటికి సశస్త్రీయంగా తిలోదకాలు ఇస్తాము కనుక ఇక వాటిని జీవితకాలంలో వాడకూడదు భుజించకూడదు. భార్యభర్తలు ఇద్దరూ ఒకే కూరగాయ,  పండు
File:Vishnupada.jpg
విష్ణుపాదం వద్ద భక్తులు 
వదలమని పురోహితుడు సూచించాడు కనుక మనసులో వదలవలసినవి అనుకుని భార్యాభర్తలు ఒకటిగా సమంత్రకంగా విస్తరాకు, కూరగాయ, పండును వదిలాము. తరువాత పురోహితుని సూచనను అనుసరించి మూడవ విడత పిణడప్రధానం చేసిన పిండాలను  ఆలయంలో ఉన్న విష్ణుపాదాల మీద ఉంచి నమస్కరించాము. అక్కడ ప్రధన పూజలు విష్ణుపాదాలకు  మాత్రమే నిర్వహిస్తారు. పక్కన విష్ణు ఉన్నమూర్తికి నమస్కరించి వెలుపలికి వచ్చాము. తరువాత అందరూ కాళ్ళు కడుగుకొని వెనుకకు తిరిగాము.

ఆలయప్రాంగణంలో ఉన్న చిన్నపాటి దుకాణంలో విష్ణుపాదాలు కొన్నాము. ఆ పాదాలకుఇంట్లో  పూజలు నిర్వహించవచ్చు. అయినప్పటికీ ఆ విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి రాలేదు కనుక ఇంటి పురోహితుని  సంప్రదించి చేయాలని అనుకున్నాము. తిరిగి అందరం పురోహితుని ఇంటికి చేరుకున్నాము. అందం ఆంద్రా భోజనం చేసాము. భోజనం ఇంటి  భోజనంలా ఉంది. తరువాత పురోహితునికి దక్షిణలు ఇచ్చి. పురోహితుని సతీమణికి వస్త్రములు ఇచ్చి వారి ఆశీర్వాదాలు వారి అందుకున్నాము. అంతటితో మా గయ యాత్ర పూర్తి అయింది.