4, జూన్ 2012, సోమవారం

పుష్కర్

పుష్కర్ 

పవిత్రమైన పుష్కర్ సరసు

శ్రీనాధ్ ద్వారక నుండి ఉదయమే బయలు దేరి  మేము పుష్కర్కు ప్రయాణం అయ్యాము. పుష్కర్ లో బ్రహ్మదేవుడు యాగం చేసిన సరసు ఉంది. భారతదేశంలో హిందూపురాణలలో వర్ణించిన అయిదు పవిత్ర సరసులలో పుష్కర్ ఒకటి. ఇక్కడ  బ్రహ్మదేవుడు యాగం నిర్వహించాడు. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి.
దస్త్రం:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg
భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. 

స్థలపురాణం 

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉన్నది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతె తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మపురాణంలో చెప్పబడిన కధను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుదంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మద్య పుష్కర్, చివరిది కనిష్ట పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనె సరస్వతి అని కూడ పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. నారదుడు వెళ్లె సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా వున్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రంహ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. శివుడు,
 విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోని కి పంపి శుద్దిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన సావిత్రి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్దాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి బార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది.
సరస్వతీ ఆలయం నుండి పుష్కర్ దృశ్యం
 తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం వున్నది. అక్కడే చిన్న సెలఏరు కూడ వున్నది. దీన్నె సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలొ స్నానం చేస్తె నిత్య సుమంగళి గా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం వున్నది.

సరసులోపలి దృశ్యం


పుష్కర్ సరసులోపల సరసు చుట్టూ కట్టడాలు నిర్మించబడి ఉన్నాయి. 53 స్నానఘట్టాలు ఉన్న బృహత్తరమైన సరసు ఇది. ఈ సరసు ధార్ ఎడారికి 20 కిలోమీటర్ల దూరంలో ధార్ ఎడారి ఉంది. మకు సమయం చాలని కారణంగా ఎడారిని చూడలేక పోయాము. అయినా ఎడారి ప్రభావం పసర భూములలో కనిపిస్తూనే ఉంది. ఈ ఊరుకు కేంద్రం పుష్కర్ సరసు ఒకటే. ఇక్కడ ఉన్న వారందరూ పర్యాటకుల మీద ఆధారపడిన వారే. సరసు చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణలో అనేక ఆలయాలు ఉన్నాయి. అయినా ప్రధాన ఆలయాం బ్రహ్మదేవుడిదే. అందు వలన భక్తులు బ్రహ్మదేవుడి ఆలయం తప్పక చూస్తారు. ప్రాకారం చుట్టూ అనేక ద్వారాలు ఆలయాలు ఉన్నాయి.


విశాలమైన ఆవరణలో పర్యాటకులకు ఈ సరసు యొక్క పురాణ కధనాన్ని గైడులు చెప్తూ ఉంటారు. ఇక్కడ లోపల పూజలు ఆరాధనలు జరుగుతూఉంటాయి. ఇక్కడ భక్తులు నీటిని బక్కెట్లతో పట్టి స్నానం చేయాలి లోపలకు దిగి స్నానం చేయడానికి వీలు లేదు. మాలో కొందరు మాత్రం స్నానాలు చేసారు. అంతగా స్నాన వసతి లేని కారణంగా అనుకున్న వారందరూ స్నానం ఆచరించస్ లేదు. సరసు పై భాగంలో రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. అక్కడ కావలసిన పూజాదికాలు నిర్వహించబడుతున్నాయి.


సరసు మధ్యలో ఒక మందిరం ఉన్నది. లోపల పక్షులు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. చుట్టూ ఉన్న కట్టడాలతో ఈ సరస్సు దృశ్యం ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. చుట్టు దూరంగా కనిపిస్తున్న కొండల మధ్య సరసు ఒక సుందర దృశ్యంగా కనిపిస్తుంటుంది. 

సరసులోపలి మండపం 
పుష్కర్ చాలా చిన్న ఊరు. ఈ ఊరిలో సరసుకు పోయే మార్గంలో యాత్రీకుల కొరకు అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలలో యాత్రీకులు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. రాజస్థానుకే ప్రత్యేక మైన వస్తువులు ఈ దుకాణాలలో అభిస్తాయి.  మేము అలా బసును నిలిపి దిగి నడుచుకుంటూ 
సరసు వద్దకు వెళ్ళి లోపక దిగి నీటిలో పాదములు కడుగుకొని కొత నీటిని తల మీద చల్లుకుని చుట్టూ ఉన్న దృశ్యాలను కొంతసేపు చూసి లోపల ఆవరణలో వీలైనంత తిరిగి అక్కడ ఉన్న బ్రహ్మదేవుడిని దర్శించాము. తరువాత సరసు నుండి వెలుపలికి వచ్చాము.



పుష్కర్ లోపలి దృశ్యాలు

సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.



పుష్కర్ లో విశ్రాంతిగా కూర్చున్న అలంకరించబడిన ఒంటె


పుష్కర్ లో ప్రవేవ్శించినప్పటి నుండి అక్కడక్కడా ఉన్న ఓంటెలు దర్శనం ఇస్తాయి. పర్యాటకులు వాటిమీద సవారి చెయ్య వచ్చు. మాలో కొంతమంది వాటి మీద సవారీ చేసి ఆనందించారు. ఆ ఒంటెలను చూసి మాకు ఉత్సాహం వేసింది.


పుష్కర్ లోని మరికొన్ని దృశ్యాలు



ఊరు సాధారణంగా కనిపిస్తున్నా ఇది చాలా పర్యాటక ఆకర్షణ కలిగిన ఊరు. ఇది హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రం. అలాగే థార్ ఎడారి సమీప ప్రాంతం కనుక ఇక్కడ ఒంటెల సంత కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ప్రజలలో కనిపిస్తున్న రాజస్థానీ సంస్కృతి కూడా విదేశీ పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. భారతదేశానికి అధికంగా విదేశీ పర్యాటకులు విచ్చేసే ప్రదేశాలలో పుష్కర్ ఒకటి. ఇక్కడ జరిగే సంతలో ఒంటెల అమ్మకం విశేషంగా జరుగుతుంది. ఒంటెలతో పాటు ఒంటెలకు కావలసిన అలంకార సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ జరిగే సంతలో ఏటా దాదాపు 50,000 ఒంటెల అమ్మకం సాగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంతకు ఒంటెలను అత్యంత ప్రయాసలకు ఓర్చి దూరప్రాంతాల నుండి తీసుకు వస్తారు.
దస్త్రం:Inde pushkar foire.jpg
వ్యాఖ్యను జోడించు


 హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం షుమారుగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన
 ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రధానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో
  స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు మరియు గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు. పవిత్రమైన సరస్సుకు ప్రఖ్యాతి చెందిన ఈ పుష్కర్ క్షేత్రం గులాబీ మరియు మల్లెల వాసనలను కూడా వెదజల్లుతూ శోభిల్లుతుంటుంది. అంతర్జాతీయంగా 4,000 నుండి 6,000ల మందికి పైగా విదేశీ పర్యాటకులను ఈ పుష్కర్ ఒంటెల సంత ఆకర్షిస్తుంటుంది. పుష్కర్‌లొ 10 నుండి 15 రోజుల వరకు జరిగే సంతలు సంవత్సరానికి 12కు పైగా జరుగుతుంటాయి. 







2 కామెంట్‌లు:

  1. వావ్! చాలా బాగున్నాయి. ఒంటెని మరింత దగ్గరిగా తీసుంటే బాగుండేది అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. విదుషీమణి రసజ్ఞ నుండి ప్రసంశ అందుకున్నందుకు సంతోషంగా నెనెర్లు చెప్తున్నను.

    రిప్లయితొలగించండి