9, జులై 2013, మంగళవారం

యమునోత్రి

 యమునోత్రి 

File:Yamunotri temple and ashram.jpg
యమునోత్రి దృశ్యం



యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.

సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.

యమునోత్రి వర్ణచిత్రం
కేదార్నాథుని దర్శనం చేసుకుని మరునాడు ఉదయం బయలుదేరి రాత్రి అయ్యేసరికి జానకిచట్టి చేరుకున్నాము.  ఉదయం జానకి చట్టీ నుండి హనుమాన్ చట్టికి వేను మాట్లాడుకుని జట్లు  జట్లుగా చేరుకున్నాము. అక్కడ డోలీ వాలాలు భారతీయులు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కౌంటర్ నుండి డోలీ టోకెన్లు కొనుక్కున్నాము. ఆ టోకెన్లు చూపి డోలీలు మాట్లాడుకుని మా మా డోలీలలో యమునోత్రి చూడడానికి ప్రయాణం సాగించాము. డోలీ వాలాలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము అంగీకారం కానట్లుంది వారు మా నుండి అధికంగా తీసుకోవడనికి ప్రయత్నించారు. అయినప్పటికీ మా బృందంలోని వారు అందుకు అంగీకారం తెలుపక ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే చెల్లించారు. ఎలాగో డోలీలలో ముందుకు సాగాము. మార్గ మద్యంలో అప్పుడప్పుడు డోలీ వాలలు డోలీ దిగి నడవమన్నారు. వారు కూడ మనుషులే కదా అనిపించింది అదీ కాక ఇలా శ్రమపడి యాత్రచేయడం కూడా మంచిదే కదా అనిపించింది. అందువలన దిగి అక్కడక్కడా  నడక సాగింది.  డోలీ ఎక్కిన తరువాత ఎవరికి వారే కదా. కాబట్టి మార్గమద్యంలో ఎవరి నిర్ణయం వారిదే కదా.






దస్త్రం:యమునోత్రిలో డోలీ.JPG
 యమునోత్రి వద్ద డోలిలు 
ఎలాగో మద్యాహ్న సమయానికి ఆలయం సమీపానికి చేరుకున్నాము. మావారు వచ్చే వరకు ఆగి వారిని కలుసుకుని నడక సాగిస్తూ అటుఇటు ఉన్న లోయలు చూస్తూ ప్రయాణం సాగించాం. అయినా ఇంకా రావలసినవారు అందరూ ఇంకా వచ్చి చేరలేదు.డోలీలు దిగి మార్గ మద్యంలో ఆ పర్వత మార్గంలో పక్కన ఉన్న లోయలలో ప్రవహిస్తున్నయమునా నదిని చూస్తూ ప్రయాణం సాగించాం. జన్మస్థలంలోయమునా  నది చిన్న ప్రవాహంలా ప్రవహిస్తున్నది.  అయినప్పటికీ నది కొంచంలో లోతుగా ప్రవహిస్తున్నందున కారణంగా నదిని చేరడం మాకు కస్టమనిపించింది.  అందరూ ఏమి చేస్తే అదే చ్స్తామని అనుకున్నాము. కొంతమంది నది దగ్గరకు నడిచి పోతూనే ఉన్నారు.
దస్త్రం:యమునోత్రిలో స్నానఘట్టం.JPG
యమునోత్రి వద్ద స్నానఘట్టం 


File:Yamuna at Yamunotri.JPG
యమునోత్రి వద్ద యమునా నది 
అలా ఆలయసమీపానికి పోయే సమయానికి పుజా ద్రవ్యాలను విక్రయిస్తున్న చిన్న దుకాణాలను చేరుకున్నాము. అక్కడ నర్మదా దేవి పూజా ద్రవ్యాలతో ఒక చిన్న బియ్యం మూట తెల్లని వస్త్రంలో చుట్టి విక్రయిస్తున్నారు. అది ఆలయం పక్కనే ఉన్న చిన్న ఉష్న గుండంలో  వండి ఇస్తారు. అందుకు కొంత మూల్యం ఇవ్వాలి. సరే అనదరూ ఏమి చేస్తే అదే చేయాలని నిర్ణయించుకున్నాం. పూజా ద్రవ్యాలను కొని తిరిగి నడకతో ఆలయసమీపానికి చేరుకున్నాము. అక్కడ మాకంటే ముందు చేరుకున్న మా బృందం వారిని  కలుసుకున్నాము. వారి కుటున్బ సభ్యులు ఇంకా చేరని కారణంగా వారిలో కొంతమంది ఒంటరిగా ఉన్నారు. వారు కుటుంబంలో చేరేవరకు వారు ఇలా అశాంతిగానే ఉంటారు. 
యమునాదేవి ఆలయ సమీపంలో 
ఆలయం సమీపంలో పెద్ద ఉష్ణగుండం ఉంది. అక్కడ యాత్రీకులు స్నానం చేస్తున్నారు. మాకది ముందుగా తెలియదు కనుక మేము మావెంట వేరే జత దుస్తులు తీసుకు వెళ్ల లేదు. అందువలన స్నానం చేసే ప్రయత్నం మానుకుని చిన్న ఉష్ణ గుండం వద్దకు చేరుకునాము. అక్కడ ఉన్నవారుకి మూల్యం చెల్లించి బియ్యం మూటను వండించాము. ఉష్ణగుండం మీద ఒక బలమైన  ఇనుప జల్లెడ వేసి ఉంది.  ఆ ఇనుపజల్లెడకు చిన్న పురికొసలు కట్టి ఉన్నాయి. ఆ త్రాళ్ళతో బియ్యం మూటలు కట్టి వాటిని కింద సలసలా  కాగుతున్న  నీటిలోకి విడుస్తారు. కొంత సమయం మాత్రం ఉంచి వాటిని పైకి తీసి త్రాళ్ళ నుండి వాటిని విడదీది యాత్రీకులకు ఇస్తారు. మేము అలా ఆ బియ్యాన్ని వండించి తీసి చూసాము. సగం సగంగా ఉడికింది. మేము వాటిని అలా వదిలి వేసాము.
యమునోత్రి వద్ద ఉష్ణ కుండం 

తరువాత మేము ఆలయానికి చేరుకున్నాము. ఆలయం చాలా చిన్నది. అయినప్పటికీ ఈ ఆలయాలు ఋషి స్థాపితాలు అనుక మహిమాన్వితమైనవి. వెలుపల మా పూజా ద్రవ్యాలను తీసుకుని అక్కడ ఉన్న పూజారి పూజ విదులను సాగించాడు.  పూజ ముగిసిన తరువాత ప్రసాదం స్వీకరించి వెలుపలకు వచ్చాము. యాత్ర నిర్వాహకులు మా కోసం మద్యాహ్న భోజనం తీసుకు వస్తామని చెప్పారు. అయినా వారెవరూ వచ్చి చేరలేదు. అందరూ రావాలంటే ఇంకా ఆలస్యం కావచ్చు. అందుకని మేము ఆహారం కొరకు ఎదురుచూడకుండా వెనుతిరగాలని నిశ్చయించుకున్నాము. మిగిలిన వారు మధ్యాహ్న భోజనం తీసుకుని  వస్తామని చెప్పారు కనుక భోజనం చేసి వస్తామని చెప్పడంతో మేము మాత్రం వెనుతిరిగాము. తిరిగి డోలీలు ఎక్కి తిరుగు ప్రయాణం సాగించాం. కిందకు దిగి డోలీల నుండి వెలుపలకు వచ్చి విడుదల లభించినట్లు అనుభూతి చెందాం.  ఔను మరి మోసేవాళ్ళు మోస్తున్నప్పటికీ ఇరుకైన డోలీలో అంతసేపు ముడుచుకు కూర్చోవడం కష్టమే.
యమునోత్రి సమగ్ర దృశ్యం 

అక్కడి నుండి బసచేరాలంటే మాజట్టు వారి కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే మేము అక్కడి నుండి వ్యానులలో వెళ్ళాలి. ఒక్కో వ్యానుకు 7 మంది ఎక్కాలి. అదీ కాక ఈ యాత్ర ఆరంభం నుండి ఇలాంటి వ్యాను ప్రయాణాలకు మాలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాం. కనుక మా బృందం వారు వచ్చే వరకు ఆగి చూసి వ్యానులో బసకు చేరుకున్నాము. అంటితో మా యమునోత్రి యాత్ర పూrtiఋతి అయినట్లే. మరునాటి ఉదయం బయలుదేరి ఇక హిమాలయాలు వదిలి పెడతాము .  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి