17, జూన్ 2012, ఆదివారం

అమర్ కోట

అమర్  కోట

దూరం నుండి అమర్ కోట 

జైపూర్ నగరానికి 11 కిలోమీటర్ల  దూరంలో ఉన్న అంబర్  అనే ఊరుకు  పక్కన ఉన్న కొండ మీద ఆటవిక ప్రాంతంలో కట్టబడిన అమర్ ఫోర్ట్  చూడడానికి బస్సు కొంత దూరంలో నిలిపి మద్యాహ్న భోజనాలు చేసి అక్కడ నుండి బసు వెళ్ళలేదు కనుక ఆటోలు మాట్లాడుకుని అమర్ ఫోర్ట్ వెళ్ళాము. అక్కడి ఆటోలు పెద్దవిగా ఉంటాయి. దాదాపు 10 మంది మనుషుల వరకు ఎక్క వచ్చు. రాష్ట్రం అంతటా ఇవి లభ్యం ఔతాయి. ఆటోలు దిగి ఏటవాలు దారిలో కొంత దూరం నడిచి కోట లోపల ప్రవేశించి విశాలమైన కోట అవరణలోకి వెళ్ళాము. ఆవరణలో ఒక వైపు
ఏనుగుల మీద సవారీ చేస్తున్న పర్యాటకులను చూసాము. రుసుము చెల్లించి ఇలా ఏనుగుల మీద సవారీ చేయచ్చు. అది చూసి మా బృందం వారు ఉత్సాహభారితులు అయ్యారు.
గణేష్ పోల్ 


తరువాత మేము గణేష్ పోల్ వద్దకు చేరుకున్నాము. అక్కడ గైడు మా కేమేరాలన్నీ తీసుకుని మాకు గ్రూఫ్ ఫోటోలు తీసి ఇచ్చాడు. మేమంతా మెట్ల మిద కూర్చుని చక్కగా గ్రుఫ్ ఫోటోలు తీసుకున్నాము. ఫోటోలు చాల బాగా వచ్చాయి. ఎంతైనా అది అయన వృత్తిలో ఫోటోలు తీయడం కూడా ఒక భాగం కదా !  గణేష్ పోల్ వద్ద మహారాజు విజయయాత్ర చేసి విజయోత్సాహంతో కోటలో ప్రవేశం చేసిన సమయంలో మహారాణి స్వాగతం పలికి సత్కరించి లోపలకు తీసుకుని పొతుంది అని గైడు మాకు చెప్పాడు.

శిలాదేవి ఆలయం 

గణేష్ పోల్ 

మెట్లదరిలో లోపలకు పోతున్న సమయంలో శీలాదేవి ఆలయం చూసాము. అయినప్పటికీ  ఆ ఆలయం ముసి ఉన్నందు వలన మేము దానిని చూడలేక పోయాము. శీలాదేవి అంటే దుర్గాదేవి మరో అవతారం. రాజ కుటుంబీకులు ఇక్కడ పూజలు చేస్తారట. తరువాత మేము పైకి పోయి మొదటి అంతస్తు చేరుకున్నాము.

దివాన్ ఐ అమ్ 

సభ మంటపం 
దివాన్ ఐ అమ్ 
మొదటి అంతస్తులో '''దివాన్ ఐ అమ్''' అనే పేరుతొ సభ మంటపం ఉంది. ఇక్కడ మహారాజు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం వంటి రాజ్య కార్యకలాపాలు సాగిస్తారట. సభామండపం కళాత్మకంగా రాజగంభిరంగానూ ఉంది.

రాజభవనం 


తరువాత మేము మహారాజా నివాసానికి చేరుకున్నాము. గణేష్ పోల్ నుండి ఇక్కడకు నేరుగా చేరుకోవచ్చు. ఇక్కడ మహారాజు తన కుటుంబం పరివారముతో నివసించే భవనాలు ఉన్నాయి. ఇక్కడ ఎదురెదుగా  జై మందిర్  మరియు రెండవ వైపున్న సుఖ్ మందిర్  ఉన్నాయి. మద్యలో వీటిని వేరు చేస్తూ మొగల్ శైలి ఉద్యానవనం ఉంది.
మొగల్  గార్డెన్

శేషమహల్ 

శేష మహల్ కుడ్యము 
శేషమహల్ పైకప్పు 
మొగల్ గార్డెన్ ఒక వైపు  జై మందిర్ ఉమది. దీనిని   శేషమహల్ అని కూడా అంటారు. శేషమహల్ గోడలు అద్దాలతో చిన్న చిన్న అద్దాలతో సుందరమైన డిజైన్లతో అలంకరణ చేసారు. ఇది చాల  ప్రశంశనీయంగా ఉంది. పై కప్పులో కూడా  వివిధ వర్ణ రంజితమైన అద్దాల డిజైన్ చేయబడి ఉంది. ఈ  గోడలు రంగుల ఫాయిల్ మరియు ప్రకాశవంతమైన  రంగులతోను అలంకరించిన కారణంగా ఇవి రాత్రి వేళలో మైనపు వత్తుల కాంతులలో వెలుగులు చిందిస్తూ రత్నాల పేటికలా  ఉంటుంది అని  గైడ్ వర్ణించి చెప్పాడు. దీనిని అద్దాల మందిరం అని కూడా పిలుస్తారట. ఇక్కడి రాజభవనం నుండి '''మోత''' సరసును చూడచ్చు .
మ్యాజిక్ ఫ్లవర్ 

 సుఖ్ మహల్ మరియు  మ్యాజిక్ ఫ్లవర్ 

సుఖ్ మహల్ 
శేష మహల్  గోడలలో చెక్కబడిన ఒక మ్యాజిక్ ఫ్లవర్ ను గైడు చూపాడు . ఈ చిత్రంలో ఒకే దిజైనులో ఏడు రకకల డిజైన్లను చూడవచ్చు. గైడు చేతులతో కొంతభాగం కప్పుతూ వాటిని చూపి వర్ణించి చెపాడు. ఆ ఏడు డిజైన్లు ఇవే చేపతోక, తామర పుష్పం,  పాముపడగ,  ఏనుగు తొండం , సిహంతోక, తేలు , మొక్కజోన్నపోత్తి .

రెండవ వైపు ఉన్న భవనాన్ని సుఖ్ మహల్ ఉంది . గంధపు చెక్కతో చేసిన ద్వారం దాటి ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడ ఒక కాలువ ద్వారా నీటిని ప్రవహింప చేసి దానిని మొగల్ గార్డెన్ లోకి చేరేలా ఏర్పాటు చేసారు. ఇందు వలన వాతావరణం చల్లగా ఉంటుంది.

రాణివాసం 

రాణివాస కూడలి 

తరువాత పైకి ఎక్కి రాణివాసం చేరుకున్నాము. ఒకప్పుడు ఇక్కడికి మగవారికి ప్రవేశం లేదు. ఇది మహారాజు భార్యలు 12 మంది కొరకు నిర్మాణం చేయబడింది. రాణులు వారి పరిజనం నివసించడానికి వీలుగా 12 ప్రత్యెక భాగాలుగా వీటిని నిర్మించారు. ఒక నివాసం నుండి  వేరొక నివాసానికి ఎటువంటి ద్వారాలు ఉండవు.  అయినా మద్య భాగంలోఅందరూ సమావేశం  కావడానికి  అనువుగా మద్య పెద్ద కూడలి ఉంది. ఒక్కో నివాసం నుండి  మహారాజ నివాసానికి రహస్య మార్గాలు ఉంటాయని మహారాజు రాక  పోకలు ఎవరికీ తలియదని గైడు  చెపాడు.  మహారాజుతో రాణి వెలుపలికి పోయిందో కూడా రహస్యంగా ఉంచబడుతుంది  అని చెప్పాడు. అన్ని నివాసాలు ఒకే మాదిరి ఉంటాయని గైడ్ చెప్పాడు. లోపల పరిచారికలకు అతిథులకు వేరు వేరు గదులు  ఉన్నాయి. రాజమాతకు కూడా అక్కడ నివాసం ఉంటుంది.
వంటశాల 
రాజభావనంలోని వంటశాల 
తరువాత మేము పట్టుబట్టి మహారాజు వంటశాల చూసాము. మహారాజుల వంటశాల ఎలా ఉంటుందో  చూడాలన్న కుతూహలం అందరిలో కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు అది ఆహార పదార్ధాల  విక్రయశాలగా ఉంది. వంటశాల లోపలకు వెళ్లి చూసాము. ఇప్పుడక్కడ వంటలు జరగడం లేదు కనుక ఇప్పుడది ఖాళీగా ఉంది. మేమంతా శీతలపానీయాలు  కొనుక్కుని అక్కడి నుండి కిందికి దిగాము.  దాదాపు మేము కోటను చూసినట్లే.

పాముల ఆట 

ఇక కిందకు దిగడానికి మొదలు పెట్టాము. కిందకు దుగుతూ
పాములను ఆడించడం 
అక్కడ పాములు ఆడించడం చూసి కొంత సమయం ఆగి పాములు అడిం చడం చూసాం . మా బృందంలో   కొందరు పాములను చూస్తూ పాములలా  నృత్యం  చేయడం మొదలు పెట్టారు. వాతావరణం ఉత్సాహ భరితంగా మారింది. అందరం అక్కడ ఛాయా చిత్రాలు తీసుకుని అక్కడి నుండి కదిలి కిందకు వచ్చాము. కిందకు  రాగానే అక్కడ ఉన్న కాఫీ స్టాల్ వద్ద నిర్వహకులు  మాకు కాఫీ టి లు ఇప్పించారు. అక్కడ ఉన్న మరి కొన్ని స్టాల్స్ వద్ద కొన్ని వస్తువులను కూడా కొనుక్కొని తిరుగు ప్రయాణం అయ్యాము.
కోట నుండి అంబర్ ఊరు 

అంబార దృశ్యం 

 కోట నుండి కింద కనిపిస్తున్న అంబర్ ఊరు  లోని దృశ్యాలు ఆకర్షణీయంగా  ఉన్నాయి. అక్కడ నిలిచి కొంత  సమయం చూసి అ దృశ్యాలను మా కెమెరాలలో బంధించి  గణేష్ పోల్ ద్వారా వెలుపలికి వచ్చాము.  మాలో చాలా  మందికి కోట ఇంక చూడాలనే ఉంది. కానీ సమయాభావం కారణంగా వేనుతిరిగా ము. అదికాక చీకటి పడే లోపల కోటను వదిలి పెట్టాలి కనుక  మేమంతా మామా అటోలను ఎక్కి బస్సు వద్దకు వెళ్ళాము. బసు ఎక్కి గైడు వర్ణన చేస్తుండగా  పింక్  సిటీని చూసాము. హావా  మహల్ గురించి విన్నాము కానీ చూడ లేదు. చివరగా గైడు చెప్పడం వలన మేము ప్రభుత్వ ఎంపోరియం చూసి అక్కడ చాలా  వస్తువులను కొనుగోలు చేసాము. ఆ తరువాత మా హోటల్ చేరుకున్నాము. ఇక మా యాత్ర పూర్తి  అయినట్లే  కనుక బసు తిరిగి పోయింది. మరునాడు మాకు ఫ్రీ టైం .అంటే ఎవరు అనుకున్న చోటుకి వారు వెళ్లి  వారి వారికి  కావలసిన వస్తుసామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చు.  ఆ మరునాడు ట్రైన్ ఎక్కాలి. 



16, జూన్ 2012, శనివారం

జైపూర్

జైపూర్ నగరం 

 

 పుష్కర్ నుండి బయలుదేరిన తరువాత మేము మా చివరి మజిలీ అయిన జైపూర్ చేరుకున్నాము . జైపూర్ చూడాలన్న  మా చిరకాల వాంఛ  ఇప్పుడు నెరవేరింది. మా కేదార్నాద్  యాత్ర  సమయంలో జైపూర్ నగరంలో బాంబులు పేలిన కారణంగా  చివరి సమయంలో జైపూర్ సందర్సన  ఆగిపొయింది. అయినా తిరిగి ఇప్పుడు మాకీ అవకాశం లభించింది  కనుక చాలా  సంతోషం కలిగింది .  ఎలాగైతేనేం జైపూర్ నగరంలో రాత్రి సమయంలో నిద్రలో జోగుతూ ప్రవేశించాము. జైపూర్ హోటల్ మా అందరికి బాగా  నచ్చింది. మేము బస చేసిన హోటల్ పేరు రూబీ  .

మేము బస చేసిన హోటల్ రూబీ
మా రూములో చక్కని పెయింటింగ్ కూడా ఉంది. అక్కడ భోజనశాల చాల విశాలంగా ఉంది.  హోటల్ వాతావరణం
రాజస్తాన్ సంప్రదాయాన్ని తెలుయ చేసేలా ఉంది. అ రాత్రి ఆహారం తిని విశ్రాంతి తీసుకోవడానికి ముందు నిర్వాహకులు మరునాడు జైపూర్ నగర సందర్సనకు   సిద్ధంగా ఉండమని  చెప్పారు.
మా హోటల్ గదిలోని వర్ణ చిత్రము

బిర్లా  మందిరము 
బిర్లా మందిరం ముందు ఉన్న చాయ చిత్రకారులు 
మరునాడు ఉదయం అల్పాహారం కాఫీలు వంటివి  అయిన తరువాత  మేము మాకు ఏర్పాటు చేసిన బసులో నగరం చూడడానికి బయలుదేరాము. ముందుగా  బిర్లా మందిరం చూసాము. బిర్లామందిరం కొంత దూరం నుండే ఛాయాచిత్రాలు తీయడం నిషేధం ఉంది. కనుక మేము అధికంగా చిత్రాలు తీయలేదు కానీ ముందుగా కొన్ని  చిత్రాలను  తీసాము. బిర్లా మందిరం చాల  ప్రశాంతముగా ఉంది. లోపల దైవాలను  దర్సించి  బయట చుట్టూ తిరిగి చూసి వెలుపలికి  వచ్చే సమయంలో ప్రవేశ ద్వారం వద్ద  ఉన్న గేటు వద్ద  ఫోటో గ్రాఫర్లు రాజస్థానీ దుస్తులను ఇచ్చి పర్యాటకులకు ఛాయా చిత్రాలను తీస్తూ ఉన్నారు.

ఆల్బర్ట్ ప్రదర్సన శాల



ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న కవచం 
ఆల్బర్ట్ మ్యూజియంలో ఒక చిత్రం 
బిర్ల మదిరం చుసిన తరువాత మేము ఆల్బర్ట్ ప్రదర్సన శాల చూడడానికి వెళ్ళాము. ఆల్బర్ట్ ప్రదర్సన శాల  మహారాజు తన మిత్రుడైన ఆల్బర్ట్ మిద అభిమానంతో కట్టించాడని మాతో బసులో వచ్చిన గైడు మాకు చెప్పాడు. తరువాతి కాలంలో ఆ భవనాన్ని మ్యూజియంగా మార్చబడింది. ఆల్బర్ట్ హాలు లోపల బద్రపరచిన వస్తువులు చాల చక్కగా ఉన్నాయి.  లోపల ఆకర్షనీయమైన వస్తువులు అనేకంతో పాటు చాలా మినియేచర్ బొమ్మలు ఉన్నాయి. అనేక భంగిమల యోగాసనాలు ప్రత్యేక  ఆకర్షణగా ఉన్నాయి. ఇలాంటి శిల్పాలను చూసే అవకాశం లభించడం చాల అరుదని నేను భావించాను. ఇలా అంతా చుసిన తరువాత మ్యుజియం వెలుపల కొన్ని వస్తువులను కొనుక్కుని అక్కడి నుండి బయలుదేరి అంబర్ కోట  చూడడానికి వెళ్ళాము. అంబర్  కోట  చూడడానికి ముందు మేము మా బసులో కూర్చుని మద్యాహ్న భోజనాలు చేశాము. తరువాత అక్కడ లభించే నిమ్మకాయ షోడా  తాగాం. నిజానికి ఈ  యాత్ర మొత్తంలో  నిమ్మకాయ షోడాలు
చాలా ప్రత్యెక రుచిగా ఉన్నాయి . ఈ షోడలలో కొందరు నిమ్మకాయ రసం, మసాలా కారం,  ఐస్ , ఉప్పు చేర్చి చేస్తారు.  ఇవి రుచిగా ఉండడమే కాక చక్కగా సేదతీర్చడం కారణంగా అందరూ యాత్రలో వీటిని త్రాగడానికి ఆసక్తి చూపారు. కొదరు వీటిలో తాజా పుదినా చేర్చి చేస్తుంటారు అవి కూడా చాల బబాగున్నాయి .  కొదరు ఈ మసాలాల తో చల్లని నీటిని కలి చేస్తున్నారు. అవి కూడా రుచిగానే ఉన్నాయి. ఇక్కడి వారికి  ఇలాంటివి చేయడంలో నైపుణ్యం ఉన్నట్లు ఉంది.
మేము జైపూర్ చూడడానికి ఏర్పాటు చేసిన బస్సు


మేము జైపూరు చూడడానికి ఏర్పాటు చేసిన బస్సులో మాతో ఒక గైడు కూడా వచ్చాడు. గైడు మాకు ఒక్కో ప్రదేశం  గురించి వివరిస్తూ వచ్చాడు. గైడు హిందిలో లేక అంగ్లంలో మాత్రమే చెప్పడం మాకు ఇబ్బంది కలిగించింది  . అయన  చెప్పెతిరు కూడా అంత స్పష్టంగా  లేక పోవడం కూడా మా  అసంతృప్తికి ఒక కారణం. అది డబల్ డెక్కర్ బసు. బసు పైన చిన్న పందిరిలా ఉంది దాని కింద సీట్లు ఉన్నాయి. మాలో కొంత  మది ఆసక్తిగా బసు  సైట్లలో కుర్చుని కూర్చున్నారు.  

      

   

4, జూన్ 2012, సోమవారం

పుష్కర్

పుష్కర్ 

పవిత్రమైన పుష్కర్ సరసు

శ్రీనాధ్ ద్వారక నుండి ఉదయమే బయలు దేరి  మేము పుష్కర్కు ప్రయాణం అయ్యాము. పుష్కర్ లో బ్రహ్మదేవుడు యాగం చేసిన సరసు ఉంది. భారతదేశంలో హిందూపురాణలలో వర్ణించిన అయిదు పవిత్ర సరసులలో పుష్కర్ ఒకటి. ఇక్కడ  బ్రహ్మదేవుడు యాగం నిర్వహించాడు. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి.
దస్త్రం:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg
భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. 

స్థలపురాణం 

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉన్నది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతె తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మపురాణంలో చెప్పబడిన కధను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుదంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మద్య పుష్కర్, చివరిది కనిష్ట పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనె సరస్వతి అని కూడ పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. నారదుడు వెళ్లె సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా వున్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రంహ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. శివుడు,
 విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోని కి పంపి శుద్దిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన సావిత్రి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్దాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి బార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది.
సరస్వతీ ఆలయం నుండి పుష్కర్ దృశ్యం
 తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం వున్నది. అక్కడే చిన్న సెలఏరు కూడ వున్నది. దీన్నె సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలొ స్నానం చేస్తె నిత్య సుమంగళి గా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం వున్నది.

సరసులోపలి దృశ్యం


పుష్కర్ సరసులోపల సరసు చుట్టూ కట్టడాలు నిర్మించబడి ఉన్నాయి. 53 స్నానఘట్టాలు ఉన్న బృహత్తరమైన సరసు ఇది. ఈ సరసు ధార్ ఎడారికి 20 కిలోమీటర్ల దూరంలో ధార్ ఎడారి ఉంది. మకు సమయం చాలని కారణంగా ఎడారిని చూడలేక పోయాము. అయినా ఎడారి ప్రభావం పసర భూములలో కనిపిస్తూనే ఉంది. ఈ ఊరుకు కేంద్రం పుష్కర్ సరసు ఒకటే. ఇక్కడ ఉన్న వారందరూ పర్యాటకుల మీద ఆధారపడిన వారే. సరసు చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణలో అనేక ఆలయాలు ఉన్నాయి. అయినా ప్రధాన ఆలయాం బ్రహ్మదేవుడిదే. అందు వలన భక్తులు బ్రహ్మదేవుడి ఆలయం తప్పక చూస్తారు. ప్రాకారం చుట్టూ అనేక ద్వారాలు ఆలయాలు ఉన్నాయి.


విశాలమైన ఆవరణలో పర్యాటకులకు ఈ సరసు యొక్క పురాణ కధనాన్ని గైడులు చెప్తూ ఉంటారు. ఇక్కడ లోపల పూజలు ఆరాధనలు జరుగుతూఉంటాయి. ఇక్కడ భక్తులు నీటిని బక్కెట్లతో పట్టి స్నానం చేయాలి లోపలకు దిగి స్నానం చేయడానికి వీలు లేదు. మాలో కొందరు మాత్రం స్నానాలు చేసారు. అంతగా స్నాన వసతి లేని కారణంగా అనుకున్న వారందరూ స్నానం ఆచరించస్ లేదు. సరసు పై భాగంలో రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. అక్కడ కావలసిన పూజాదికాలు నిర్వహించబడుతున్నాయి.


సరసు మధ్యలో ఒక మందిరం ఉన్నది. లోపల పక్షులు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. చుట్టూ ఉన్న కట్టడాలతో ఈ సరస్సు దృశ్యం ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. చుట్టు దూరంగా కనిపిస్తున్న కొండల మధ్య సరసు ఒక సుందర దృశ్యంగా కనిపిస్తుంటుంది. 

సరసులోపలి మండపం 
పుష్కర్ చాలా చిన్న ఊరు. ఈ ఊరిలో సరసుకు పోయే మార్గంలో యాత్రీకుల కొరకు అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలలో యాత్రీకులు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. రాజస్థానుకే ప్రత్యేక మైన వస్తువులు ఈ దుకాణాలలో అభిస్తాయి.  మేము అలా బసును నిలిపి దిగి నడుచుకుంటూ 
సరసు వద్దకు వెళ్ళి లోపక దిగి నీటిలో పాదములు కడుగుకొని కొత నీటిని తల మీద చల్లుకుని చుట్టూ ఉన్న దృశ్యాలను కొంతసేపు చూసి లోపల ఆవరణలో వీలైనంత తిరిగి అక్కడ ఉన్న బ్రహ్మదేవుడిని దర్శించాము. తరువాత సరసు నుండి వెలుపలికి వచ్చాము.



పుష్కర్ లోపలి దృశ్యాలు

సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.



పుష్కర్ లో విశ్రాంతిగా కూర్చున్న అలంకరించబడిన ఒంటె


పుష్కర్ లో ప్రవేవ్శించినప్పటి నుండి అక్కడక్కడా ఉన్న ఓంటెలు దర్శనం ఇస్తాయి. పర్యాటకులు వాటిమీద సవారి చెయ్య వచ్చు. మాలో కొంతమంది వాటి మీద సవారీ చేసి ఆనందించారు. ఆ ఒంటెలను చూసి మాకు ఉత్సాహం వేసింది.


పుష్కర్ లోని మరికొన్ని దృశ్యాలు



ఊరు సాధారణంగా కనిపిస్తున్నా ఇది చాలా పర్యాటక ఆకర్షణ కలిగిన ఊరు. ఇది హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రం. అలాగే థార్ ఎడారి సమీప ప్రాంతం కనుక ఇక్కడ ఒంటెల సంత కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ప్రజలలో కనిపిస్తున్న రాజస్థానీ సంస్కృతి కూడా విదేశీ పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. భారతదేశానికి అధికంగా విదేశీ పర్యాటకులు విచ్చేసే ప్రదేశాలలో పుష్కర్ ఒకటి. ఇక్కడ జరిగే సంతలో ఒంటెల అమ్మకం విశేషంగా జరుగుతుంది. ఒంటెలతో పాటు ఒంటెలకు కావలసిన అలంకార సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ జరిగే సంతలో ఏటా దాదాపు 50,000 ఒంటెల అమ్మకం సాగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంతకు ఒంటెలను అత్యంత ప్రయాసలకు ఓర్చి దూరప్రాంతాల నుండి తీసుకు వస్తారు.
దస్త్రం:Inde pushkar foire.jpg
వ్యాఖ్యను జోడించు


 హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం షుమారుగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన
 ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రధానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో
  స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు మరియు గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు. పవిత్రమైన సరస్సుకు ప్రఖ్యాతి చెందిన ఈ పుష్కర్ క్షేత్రం గులాబీ మరియు మల్లెల వాసనలను కూడా వెదజల్లుతూ శోభిల్లుతుంటుంది. అంతర్జాతీయంగా 4,000 నుండి 6,000ల మందికి పైగా విదేశీ పర్యాటకులను ఈ పుష్కర్ ఒంటెల సంత ఆకర్షిస్తుంటుంది. పుష్కర్‌లొ 10 నుండి 15 రోజుల వరకు జరిగే సంతలు సంవత్సరానికి 12కు పైగా జరుగుతుంటాయి. 







30, మే 2012, బుధవారం

అమరనాధ్

 అమరనాధ్ యాత్ర

Cave Temple of Lord Amarnath.jpg
అమర్నాథ్ గుహ ముఖద్వారం

అమరనాథ్ స్థలపురాణం

హిందువులు కోరుకునే యాత్రలలో అమరనాధ్ యాత్ర ఒకటి. అమరనాధుడంటే జరామరణములు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో " నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను " అని బదులిచ్చాడు. పార్వతీ దేవి " నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నవు ఇది ఎలా సాధ్యం " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పలి " అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కొరకు వెతకి చివరకు ఈశ్వరుడు  అమరనాధ్ గుహను ఎంచుకున్నాడు. పహల్ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్ళాడు, షిషాంగ్ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు, మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు, తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమనాధ్ గుహలోపలికి వెళ్ళాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వరహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాలజంట ఈ  రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయి. ఇప్పటికీ భక్తులకు ఆ పావురాల జంట దర్శనం ఇస్తాయి. అని వినికిడి.

అమర్నాథ్ యాత్రీకుల శిబిరాలు

 

వేరొక కధనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహిపజేసాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణ కధనాలు చెప్తున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. అప్పటి నుండి ఇక్కడకు లక్షలాది భక్తులు వచ్చి శివారాధన చేసి శాశ్వమైన పరమానందం అనుభవిస్తున్నారు. భక్తులు ఇక్కడకు రావడానికి అత్యంత కఠినమైన పర్వత మార్గంలో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ప్రాయాణంచేసి ఈ గుహను చేరుకుంటారు. శ్రావణ మాసపు ఆరంభంలో భక్తులు ఇక్కడకు చేరుకుని అప్పటికే పూర్తిగా ఏర్పడిన ఘనీభవించిన మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుటారు. ఈ లింగం చంద్ర కళలకు అనుకూలంగా కరుగుతూ పెరుగుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ లింగానికి ఇరువైపుల ఉన్న రెండు లింగాలాను మాతాపార్వతీ దేవి మరియు గణేశ్ రూపాలుగా భావించి ఆరాధనలు చేస్తుంటారు.
అమర్నాథ్ ఆలయానికి పయనిస్తున్న యాత్రీకులు 
ప్రస్తుత కాలం 
ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కధనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు.  బూటా మాలిక్ వాటిని తీసుకుని  ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు  పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.

  గుహాలయం 

 అమర్నాథ్ ఆలయంలోని మంచు లింగం
లిడ్డెర్ వ్యాలీ పహల్ గాం నుండి 46 కిలోమీటర్లదూరంలో, భూమట్టం నుండి 3,888 అడుగుల ఎత్తులో బాల్ తాల్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఈ అమరనాథ్ గుహ ఉంది. చార్ ధాం అని పిలువబడే వాటిలో ఒకటి అయిన అమరనాథ్ యాత్రను శ్రీనగర్ నుండి ఆరంభం ఔతుంది అయినా ఇది 96 కిలోమీటర్ల చాలా సుదీర్గమైన యాత్ర కనుక సాధారణంగా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్ వారి నుండి యాత్రకు వెడుతుంటారు.

సంప్రదాయ యాత్రా మార్గం

 

* జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారు చాలా ఉదయాన మాత్రమే వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యం ఔతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మిని బస్సులు లభ్యం ఔతాయి. లిడ్డర్ నతీ తీరం వెంట ఈ బసు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు.  సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతి వచ్చే అనుభూతికి లోను ఔతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.




* పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతస్మంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పాలకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.





యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.



యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంచానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 


* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 

* యాత్రీకులు "శ్రి ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 

* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు ఔతుంది.


యాత్రీకులు చేయవలసినవి 


* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరెలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యకు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమిన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించిన సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోడి. అయవసర సమయాలలో అది ఉపకరిస్తుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణ కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయ్ణం చేసే సమయంలో వేగించిన పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీమీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
* చందాలను డొనేషన్ బాక్సులో వేయండి.

యాత్రీకులు చేయకూడనివి 

* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మదూపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.


29, మే 2012, మంగళవారం

శ్రీనాద్ ద్వారక

శ్రీనాద్  ద్వారక 

ఉదయపురు నుండి బయలుదేరి రాత్రికి శ్రీనాద్ ద్వారక చేరుకున్నాము. మా  అందరిని హోటల్ రూములకు  చేర్చి బసును  దూరంగా పార్క్ చేసారు.   హోటల్ వారు మాకు కుంకుమ చందనము ఇచ్చి సత్కరించారు. మా యాత్రలో మమ్మిలా సత్కరించింది వీరే.   ఇది మాకందరికి అనందం కలిగించింది. అక్కడ మరొక ఆసక్తి కరమైన అనుభవం ఎదురైనది. అదేమిటంటే మా రుములకు వెలుపల ఇప్పటి మోడెం వంటి మంచాలు పరుపులు ఏర్పాటు చేసారు. అప్పటికే మా మద్య పరిచయాలు పెరిగిన కారణంగా అలా అందరం మంచాల మీద కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి అల్పాహారం ఘనంగా ఆరోజుకు తిని విశ్రాంతి తీసుకున్నాము. నిర్వాహకులు మాతో మరునాడు నాలుగున్నరకు సిద్ధంగా ఉండమని చెప్పారు. వారు చెప్పిన విధంగానే మేము సిద్దం  అయ్యాము. ఈ  ఆలయ విశేషాలు చెప్పాలి కదా.

ఆలయ విశేషాలు  

 ఈ ఆలయము బృందావనములోని నందమహారాజ ఆలయా శైలిలో నిర్మించబడింది. అందువలన దీనిని నందాభవన్ లేక నందాలయం అని కూడా పిలువబడుతుంది. ఆలయగోపురం మీద ఉన్న కలశంలో సుదర్శనచక్రంతో ఏడు జెండాలు కూడా ఎగురుతుంటాయి. ఈ ఏడు జెండాలు శ్రీకృష్ణుని ఏడుగురు సఖులకు గుర్తుగా ఉంది. ఈ ఆలయం ప్రబలంగా శ్రీనాధ్‌జీ కి హవేలి (శ్రీనాధుని భవనము) ఎందుకంటే సాధారణ ఇల్లులాగా ఈ ఆలయములో ప్రయాణించడానికి అనువుగా ఒక రధము ఉంటుంది. (ఒకవేళ శ్రీనాధ్‌జీ సింఘర్‌కు తీసుకు వచ్చిన రధము వంటిది), పాలకొరకు ఒక సామాను గది(దూద్ ఘర్), తంబూలము కొరకు ఒక సామానుగది(పాన్ ఘర్), తీపిపదార్ధాలకొరకు మరియు పంచదార కొరకు ఒక సామానుగది (మిష్రింఘర్ లేక పెదఘర్), పూలకొరకు ఒక సామానుగది(ఫూల్ ఘర్), ఒక వంటగది(ఇక్కడ వంట చేయబడుతుంది )దీనిని రసోయీ ఘర్ అంటారు, ఒక ఆభరణ శాల (ఘనాఘర్), ఒక ఖజానా (ఖర్చా భండార్), అశ్వశాల, ఒక హాలు(బైటక్), ఒక స్వర్ణ మరియు రజిత తిరగలి (చక్కి), ఈ ఆలయానికి ప్రాకారంలో మదన్ మోహన్ మరియు నవనీత్‌జీ ఉపాలయం ఉంది.

ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఏడమ చేతి చిటికెన వేలు తో గోవర్ధన గిరిని ఎత్తుతూ కుండి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆలయంలో ఉన్నది నల్లని మార్బుల్ రాతి మీద చెక్కబడిన శిల్పము. ఈ శిల్పములో శ్రీకృష్ణుడితో రెండు ఆవులు, ఒక సింహము, రెండు నెమళ్ళు, ఒక పాము మరియు ఒక చిలుక ఉంటాయి.


ఈ ఆలయానికి జన్మాష్టమికి భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి మరియు హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనము (ప్రసాదము) లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లకుల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారులు వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తీసుకు వచ్చిప్రతిష్ఠించాడు.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి మరియు అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచ, జరీ ఖండువా, రత్నఖచిత ఆభరణాలు వడుతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.

మతవిశ్వాసాలను అనుసరించి నాధ్‌ద్వరా ఆలయ నిర్మాణము శ్రీనాధ్‌జీ నిర్ణయించిన ప్రదేశంలో జరిందని భావించబడుతుంది. శ్రీనాధ్‌జీ విగ్రహాన్ని మొగలు సామ్రాజ్యా మతవ్యరేకత నుండి రక్షించి సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి బృందావనం నుండి తీసుకు వస్తూ  ఎద్దులబండిలో వస్తున్న తరుణంలో ఒక ఎద్దు కిందకు వాలింది. అలా వాలడం గమనించి వెంట వస్తున్నపూజారులు అది భగవానుడి ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణం చేయమని సూచించారు. ఈ ఆలయనిర్మిత ప్రదేశం అప్పుడు మేవార్ రాజైన రాజ్ సింగ్ పాలనలో ఉండేది. ఈ ఆలయము శ్రీనాధ్‌జీ హవేలి అని పిలువబడుతుంది.

ఆలయ దర్సనం 

 శ్రీనాద్ ద్వారక ఆలయంలో శ్రీకృష్ణుడికి విశేషమైన పూజలు ఆరాధనలు జరుగుతుంటాయి. శ్రికృష్ణుడి వైభవం అల ఉంటుంది మరి. శ్రీకృష్ణుడు నందగోపుడి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను ఎలా చూసారో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటారు. ఈ ఆలయంలో కృష్ణుడికి ఎనిమిది మార్లు పూజలు చేసి ఎనిమిది మార్లు ఎనిమిది అలంకరణలు చేసి ఎనిమిది మార్లు భక్తులు దర్శించడానికి అనుమతి లభిస్తుంది. చివరగా హారతి ఇచ్చిన తరువాత ఆలయాన్ని మూసి వేస్తారు. భక్తులు ఎనిమిది మార్లు దర్సనం చేసుకోవడానికి ఉత్సుకత చూపుతుంటారు.  అయితే మేము మాత్రం నలుగు మార్లు మాత్రమే దర్సనం చేసుకున్నాము. 

* మొదటి మారు దర్సనానికి శ్రీకృష్ణుడు దుప్పటి మూసుకుని ఉన్నట్లు ఉంటుంది. అంటే కృష్ణుడిని తెల్లవారు ఝామున లేపాలి అన్నమాట. భక్తులు అల దుప్పటి కప్పుకున్న కృష్ణుడిని దర్సనం చేసుకుంటారు. ఈ దర్శనాన్ని మంగళ దర్సనం అంటారు. ఈ సమయంలో కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. అప్పుడు మధుర గీతాలను ఆలాపన చేసి కృష్ణుడిని నిద్రలేపుతారు.
* తరువాత దర్సనం శృంగార దర్సనం. ఈ సమయంలో కృష్ణుడికి తల నుండి కాలు వరకు సుందరమైన అలంకరణ చేసి పుల మాల  వేసి అద్దంలో అయన ప్రతిబిబం ఆయనకు చూపి ఆయనను ఆనందింప చేస్తారు. అప్పుడు ఆయనకు ఖర్జూరం వంటి ఎండు ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉంటుంది . అయన వేణువును ఊది రాధను ఆనందింప చేయడానికి ఇలా చేస్తారు. 
* మూడవ దర్సనం గ్వాల్  అంటారు. ఈ సమయంలో గోశాల నుండి గోపలనాయకుడు వచ్చి కృష్ణుడికి గోవులన్నీ క్షెమమని విన్నవిస్తాడు. అప్పుడు కృష్ణుడికి వెన్నతో చేసిన మకాన్ మిశ్రి అనే పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. మేడలో పూలమాల కూడా ఉండదు. నైవేద్యం కూడా తేలికగా ఉంటుంది. అప్పటికి గోపికలు కృష్ణుడికి బలమైన ఆహారం సమర్పిచి ఉంటారు అని విశ్వసిస్తారు.
* తరువాత దర్సనం రాజభోగ్ అంటారు. ఇప్పుడు స్వామిని చాల చక్కగా వస్త, ఆభరణాలు , పూలమాల, వేణువుతో అలంకరించి చాల మచి భోజనం అనేక పదార్ధాలు కిల్లి తో సహా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దర్సనానికి ముందు ఆలయ పూజారి గోపురం ఎక్కి మాలా బేగి లాయియో  అని అరుస్తాడు. అంటే మల త్వరగా తీసుకురా అని అర్ధం. ఇలా అరవగానే అది పూజకు దర్సనానికి సంకేతంగా భావించి భక్తులు దర్శనార్ధం వస్తారు. అప్పుడు చక్కగా డ్రమ్ములు కూడా మ్రోగిస్తారు .ఈ దర్సనం తరువాత కృష్ణుడు మూడు గంటల అనంతరం సఖులతో పచ్చిక బయలులో ఆవులతో విహరించి ఇంటికి చేరుకుంటాడు కనుక మద్యలో దర్సనం ఉండదు.
* ఈ దర్శనాన్ని ఉత్తపాన్ అంటారు. కృష్ణుడు తన సఖులతో గువులను తోలుకుని ఇంటికి చేరిన సమయం ఇది. సాయంత్రం మూడున్నర గంటలకు ఈ దర్సనం ఉంటుంది. ఇప్పుడు విన మిద కీర్తనలు ఆలపిస్తారు.
* ఉత్తాపన దర్సనం  తరువాత ఒక గంట తరువాత అరవ దర్సనం అయిన భోగ దర్సనం ఉంటుంది.  ఇప్పుడు స్వామి తలపాగా, నడుముకు మెరిసే స్కర్ట్ , చేతులకు , ఆభరణాలు , పతకము   అలంకరణతో కనిపిస్తాడు. కృష్ణుడికి అల్పాహారం నైవేద్యంగా సమర్పిస్తారు. చామరం వీచి  దిష్టి తీస్తారు. 
*  సంధ్య హరతి అంటే సాయంత్రం  దర్శనం. ఈ దర్శనం మునిమపు వేళలో ఉంటుంది. ఇప్పుడు క్రుష్ణుడు వస్త్త్ర ధారణ తేలికగ ఉంటుంది. రోజంత శ్రమించిన తరువత విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సుదర్సన చక్రం పైకప్పు మీద ఉంచబడుతుంది. క్రుష్ణుడి ఏడుగురు గోపాల సఖుల గుర్తుగా ఉన్న ఏడు ధ్వజాలు మరునాటి ఉదయం వరకు చుట్టి ఉంచుతారు. రాత్రి ఆహరం నైవేద్యంగా సమర్పించి హరతి తీసి దర్సనం ముగిస్తారు. 
*  ఇది రోజులో ఆఖరి దర్శనం ఇప్పుడు పూజారి మిద్దె మీద నిలబడి వంటమనిషిని పిలిచి రేపు త్వరగ రమ్మని చెప్తాడు. తరువత కృష్ణుడు నిద్రించే సమయం. క్రుష్ణుడికి వివిధమైన ఆహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. మధురమైన కీర్తనలను ఆలపిస్తారు. తాంబూలం నైవేద్యంగా సమర్పిస్తరు.  తరువత క్రుష్ణుడి పడకటింటిని సిద్ధం చేస్తారు. ఒక పత్రలొ ఆహారం, జలపత్రలో మంచి నీరు, కిల్లీలు పక్కన ఉంచుతారు, రాత్రి వేళలో రాధా రాణి కృష్ణుడిని సేవించడానికి వస్తుందని ఆమె దుస్తులు మరియు ఆభరణాలను పక్కన ఉంచుతారు. పడకటింటి వరకు కార్పెట్ పరచి కృష్ణుడి మందిరంలో భక్తులు దర్శనార్ధం ఉంచిన చెక్కల అడ్డాలను తొలగిస్తారు. భక్తులను ఎండ నుండి కాపాడటానికి ఉంచిన చత్రలను సైతం తొలగిస్తారు. శ్రీనాధుడు  నిరాటంకంగా గోపికలతో విహరించ్డానికి అనువుగా ఇటువంటి మార్పులను చేపడతారు. ఈ దర్శనం చిత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుండి ఆశ్విజమస శుక్లపక్ష నవమి వరకు ఉండదు. అప్పుడు క్రుష్ణుడు వ్రజభూమికి వెళతాడని ఈ దర్శం ఆపివేస్తారు. క్రుష్ణుడు ఆసమయాన్ని వ్రజవాసులకు కేటాయిస్తాడు. 


మేము ఉదయపు రెండు దర్శనలను చూసి మద్యలొ కంగ్రోలి ద్వరకకు పక్కనే వెళ్ళి తిరిగి వచ్చి మద్యాహ్న భోజనాలు చేసి. సాయంత్రం నాలుగు గంటల నుండి రెండు దర్శనలు చూసి హోటల్ రూములకు చేరాం. సాయంత్రవేళలో ద్రమ్ములు వాయించడం అక్కడి ఆనందకరమైన ఏర్పాట్లు మమ్ము చలా ఆకర్షించాయి.. మునిమాపు వేళలో ఆరతి దర్శనం సమయంలో కొందరు గోపాలకుల వేషంలో, కొందరు గోపికల వేషంలో ఆలయంలో నిలిచి ఉన్నారు. ఈ వాతావరణం నిజంగా నందగోకులంలో ఆ సమయంలో ఇలా ఉండేదేమో అనిపించేలా చేసింది. దర్శనసమయాలలో భక్తులు విపరీతంగా తోపిడికి గురి చేస్తారు. గోపికలు ఇలా శ్రీకృఇషుడి చెంతకు చేరతారు కబ్నుక్,అ ఆయనను ఇలానే దర్శనం చేయాలని వారి అభిమతమట. ఏది ఏమైనా శ్రీనాధ్ ద్వరక దర్శనం మాకు ఆనందాన్ని వింత అనుభూతిని కలుగ చేసింది. అవకాశం ఉన్న వారు ఎనుమిది దర్శనలు చేస్తారని నిర్వహకులు చెప్పారు. ఒక్కో దర్శనం ఒక వైవిధ్యమైనది కనుక అలాచేస్తారట. 

మరునాడు శ్రీనాధ్ ద్వరకనుండి మేము బయలుదేరే సమయంలో హోటల్ వారు మాకు శ్రీనాధుడి చిత్రపటాలను కనుకగా ఇచ్చి సాగనంపారు. హోటల్ వారి అతిథి సత్కారం కూడా మమ్ము మరింత ఆనందింపచేసింది మరి. చక్కటి అనుభూతిని మనసులో మిగుల్చుకుని మేం   శ్రీనాధ్ ద్వారక విడిచాము. 


24, మే 2012, గురువారం

ఉదయపూరు



ఉదయపూరు


ఉదయపూరు కోట ద్వారం 

అబూ పర్వతం చూసిన తరువాత మరునాటి  ఉదయం బయలుదేరి ఉదయపూరు చేరాం . మా యాత్రలో ఉదయపూరు నిర్వాహకులు  లేకున్నా సమయం ఉన్నందు వలన మాకు అదనంగా చూపిస్తున్నామని చెప్పారు.  ఉదయపూరులో నిర్మాణాలు చాలా వరకు తెల్లగానే ఉన్నాయి. 
ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం(సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయపూర్ రాజధానిగా ఉండేది. . ఈ నగరాన్ని తూర్పు వెనిస్ నగరం, ప్రేమ నగరం మరియు సరస్సుల నగరం అని
 ఉపనామాలు ఉన్నాయి. మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని  ఆరావళి పర్వత పాద పంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించాడు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో నిండి ఉంటుంది ఉదయ్ పూర్.
 గైడు మాకు  ఉదయపూరును శ్వేతనగరం (వైట్ సిటి) అని అంటారు అని చెప్పాడు. ముందుగా ఉదయపూరు కోట చూసాము. కోటలో ప్రవేశించడానికి టిక్కెట్ కొనుక్కుని లోపలకు వెళ్ళగానే విశాలమైన ప్రాంగణం మమ్ము ఎంతో ఆకర్షించింది. 
ఉదయపురు కోటలో విశాలమైన ప్రాంగణం 

లోపలకు వెళ్ళిన తరువాత రాజప్రాసాదం లోకి ప్రవేశించి అక్కడ కొన్ని చిత్రాలను  చూసాము.  వాటిని ఫోటో తీయడానికి మాకు అనుమతి లేదు కనుక ఫోటోలు తీయలేక పోయాము. మాకు తెలియక కొన్ని పొటోలు తీసిన తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటి సూచన మేరకు కెమెరాలను అక్కడ ఒప్పగించి ముందుకు సాగాము.  లోపల రాజభవనం చాల ఆకర్షనీయంగా  ఉన్నాయి. కోటను దర్సించిన ఆనందంతో వెలుపలకు వచ్చి బస్సు ఎక్కి ముందుకు సాగాము. 
ఉదయపురు రాజవంశం 
ఉదయపురు రాజ చిహ్నము సూర్యభగవానుడు 
వ్యాఖ్యను జోడించు
ఉదయపురు రాజసభ

మద్యాహ్న భోజనాలు అనంతరం  హల్దీఘాట్  చూడడానికి వెళ్ళాము. ఇక్కడ రాజా ప్రతాప్ సింగ్ మొగల్ సేనల సాయంతో దండెత్తి వచ్చిన రాజమాన్ సింగ్ తో యుద్ధం సాగించిన ప్రదేశం.  ఇక్కడ 
రాజా ప్రతాప్ సింగ్ ప్రియతమ అశ్వం చేతక్ యుద్ధంలో తన రెండు కాళ్ళను కోల్పోయిన తరువాత కూడా సాహసంతో  రాజా ప్రతాప్ సింగ్ ను నదిని దాటించి తన ప్రాణాలను విడిచి త్యాగం ప్రదర్శించిన పవిత్ర ప్రదేశం ఇదే. చేతక్ ప్రాణత్యాగం చేసిన ఈ  ప్రదేశంలోరాజా ప్రతాప్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించాడు.  ఇక్కడి ప్రజలు చేతక్  సాహసాన్ని చాల అభిమానిస్తారు.  తమ అభిమానానికి గుర్తుగా ఇక్కడ తాయారు చేయబడుతున్న ద్విచక్ర వాహనాలకు  చేతక్ అని నామకరణం చేసి గర్వపడుతున్నారు.  గైడు చెప్పిన ఈ సంఘటన మా హృదయాలను కదిలించింది.

హల్దీ ఘాట్ చుసిన తరువాత సహేలియోకి భారి చూడడానికి వెళ్ళాం .  సహేలియోకి భారి అంటే చెలికత్తెల పూదోట . రాణి చెలికత్తెలు 48 మంది నిరాహార దిక్ష ఫలితంగా వారి విహారం కొరకు ఈ  పూల తోట  నిర్మాణం జరిగింది. చెలికత్తెలు తమకు విహారానికి తగిన ప్రదేశం లేదని చింతిస్తున్నారని తెలుసుకుని మహారాజు ఈ మనోహర పులతోటను నిర్మించి  వారికి  కానుకగా ఇచ్చాడు. ఈ తోటలో  బరిష్ గార్డెన్ , బర్డ్ గార్డెన్ , హథీ గార్డెన్,  లోటస్ గార్డెన్,  హోలీ గార్డెన్ అనే విభాగాలు ఉన్నాయి.  బారిష్ గార్డెన్ లో నీటి ఫౌంటెన్ సాయంతో వర్షం కురుస్తున్న శబ్దం వినిపించే ఏర్పాటు చేసారు. హథీ గార్డెన్ లో గంభీరమైన పాలరాతి ఏనుగు శిల్పాల నోటి నుండి నీరు చిమ్మే ఏర్పాటు చేసారు.
లోటస్ గార్డెన్ లో తామర కొలను ఏర్పాటు చేసారు.   బర్డ్ గార్డెన్ లో నీటి సాయంతో పక్షుల కిలకిలారవం విపించే ఏర్పాటు చేసారు. హోలీ గార్డెన్ లో హోలీ పాడుగా జరుపుకుంటారు.
సహేలియోకి భారి ప్రవేశ ద్వారం 



పక్షుల తోట 

హథీ గార్డెన్ 

హోలీ గార్డెన్ 

కొలను మధ్యలో శకుంతల మడపం 
సహేలియోకి భారి చుసిన తరువాత ఏక లింగేశ్వర ఆలయం చూడడానికి వెళ్ళాం.  ఏక లింగేశ్వర ఆలయం ఉదయపూరులో  తప్పక చూడవలసిన ఆలయాలలో ఒకటి. ఆలయం రాజ గంభీరంగా ఉంది. ఇక్కడ రాజ కుటుంభం వారు ఈశ్వర ఆరాధన చేస్టారు కనుక ఆలయం అంత రాజ గంభీరంగానే ఉన్నది.  గర్భాలయంలోని ఈశ్వరుడికి  నాలుగు ముఖాలు ఉంటాయి. బ్రహ్మ,విష్ణు  , మహేశ్వరుడు వారితో  నాలుగవ ముఖంగా రాజకుటుంబ ఆరాధ్య దైవం అయిన సూర్యుడు ఉంటారు.  అలయదర్సనం నిజంగా మానసిక ఆనందాన్ని కలిగించింది. ఇలా మా ఉదయపురు సందర్శనం మాకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది.