17, ఫిబ్రవరి 2013, ఆదివారం

కేదార్నాథ్

కేదార్నాథ్ 


కేదారీశ్వరాలయం 


ఇలా ఉంటాయి ఆ గుడారాలు 
మంచుతెరల మద్య  కేదారీశ్వరుడు 
గంగోత్రి తరువాత మా గమ్యం కేదార్నాథ్ దర్శనం. గంగోత్రి చూసుకుని ఉత్తరకాశిలో బసచేసి మేము ఉదయాన్నే  బయలుదేరి గౌరీకుండ్ వైపు పయనం సాగించాం.  మార్గ మద్యంలో టీ కాఫీలు త్రాగే సమయంలో కొన్ని గుడారాలను చూసాం అవి మాబృందం వారికి చాలా ఆసక్తి కలిగించాయి. కోంచెం దిగువలో ఉన్న ఆ గుడరాలను వారి అనుమతితో పరిశీ లనగా చూసాం. అవి ఉత్తర భారత పర్యాటాకుల గుడారాలు. వారు కూడా యాత్ర చేస్తున్నవారే. ఇలాంటి యాత్రలను కూడా నిర్వహిస్తారని వారిని అడిగి తెలుసుకున్నాము. ఒక్కో గుడారాలలో పడకలు వంటి  అత్యావసర వసతులు ఉన్నాయి. అందరికీ ప్రత్యేకంగా మరొక గుడారంలో భోజనశాల కూడా ఉంది. మా బృందం వారికి అలాంటి యాత్ర చేయాలన్న ఆసక్తి కలిగింది. ఇలా ప్రయాణం లోని మద్య మద్య మజిలీలను కూడా ఆశ్వాదిస్తూ ముందుకు సాగాం.
గౌరీ కుండ్ 

గౌరికుండ్ రద్దీ 
గౌరికుండ్ బస్ స్టాండ్ 
రాత్రి సమయానికి గౌరీకుండ్ చేరాం.  యధా ప్రకారం మూడు కిలో మీటర్ల దూరంలోన్రే బస్సు ఆగింది. అయినప్పటికీ నిర్వాహకులు వ్యానులలో మా అందరిని మా  సామానులతో సహా  బస వద్దకు  చేర్చారు నిర్వాహకులు.  వ్యాను దిగి సామానులు మోయడానికి మనుషులను ఏర్పాటు చేసుకుని కోచెం దూతంలో ఉన్న బసకు బయలుదేరాం. దారిలో మనుషుల  రద్దీ ఎక్కువగా ఉంది. యాత్రీకులకు నాలుగు రెట్లు సహాయకులు కావాలి కనుక ఊరంతా వారితో నిండి ఉంది. వారే యాత్రీకుల సామాను తీసుకు వెళ్లడానికి కూడా సహకరిస్తారు. మేము చిన్నగా ఏలాగో బసకు చేరుకున్నాము. అక్కడ మాకు గదులను ఇవ్వగానే గదులకు చేరుకుని రాత్రి ఆహారం తీసుకుని విశ్రమించాం. 

కేదార్నాథ్ ఆలయానికి తీసుకుపోయే గుర్రాలు ఇలా ఉంటాయి 


వంపులు తిరిగిన ఘాట్ మార్గం 
14 కిలోమీటర్ల కేదార్నాథ్ మార్గంలో ప్రవేశం 
మరుసటి రోజు నిద్రలేచి  స్నానం చెయ్యడనికి వేడి నీరు తెప్పించుకుని స్నానాలు కానిచ్చాం. అసలు గౌరీ కుండ్ లో స్నానం చెయ్యడానికి ఉష్ణకుండం ఉందని చెపారు అయొనప్పటికీ అది ఎక్కడుందో తెలుసుకుని స్నానాలు చేసి తిరిగి బసకు చేరడానికి  సమయం కావాలి. మాకు అంత సమయం లేదు కనుక గదులలలోనే స్నానాలు చేసి ప్రయాణానికి సిద్ధం అయ్యాము. గౌరీ కుండ్ నుండి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ప్రయాణానికి సిద్ధంగా ఉన్న గుర్రాలు 
చీకటి పడేవేళకి రానూ పోనూ  28 కిలో  మీటర్లదూరాన్ని  ప్రయాణించి బసకుచేరాలి కనుక మా గదిలో నే స్నానాలు ముగించి ఫలహారం తిని ప్రయాణనికి సిద్ధం అయ్యాము. గౌరీ కుండ్ నుండి కేదార్నాథ్ కొండ  మార్గంలో ప్రయాణం చెయ్యాలి.  కేదార్నాథ్ మర్గం ఎగుడు దిగుడుగా వంపులు తిరిగి ఉంటుంది. సాధారణంగా  యాత్రికులు  ఆ మార్గంలోనడిచి వెళ్లి ఒక రోజులో స్వామిని దర్శించి తిరిగి కిందకు చేరుకోవడం సాధ్యం కాని పని. కనుక డొలీలు, చిన్నసైజు గుర్రాలు వంటి వాటిలో ప్రయాణించాలి.
గౌరీకుండ్ దృశ్యం 


Name:  100_7401.JPG
Views: 348
Size:  265.6 KB
గౌరీకుండ్ 
Temple at the hot springs - Gaurikund
గౌరీమందిర్ 
మేము బయలుదేరడనికి ముందు అక్కడ ఉన్న ఆలయాలను దర్శించడానికి వెళ్ళాము. ఆలయాలు బసకు సమీపంలోనే ఉన్నాయి కనుక కాలినడకన వెళ్లము. అక్కడాకు వెళ్లిన తరువాత అక్కడే ఉస్హ్ణ గుండం ఉందని తెలుసుకుని అక్కడ స్నానం చెయ్యలేక పొయ్యామని అనుకున్నాము. పరవాలేదనుకుని అక్కడి ఆలయాలు దర్శించుకున్నాము. ఆలయాలు అన్నీ సాధారణంగా ఉన్నా అవి మహర్షుల పాదస్పర్శ కలిగినవన్న స్పృహ కలిగి  మనసులో ఆనందానుభూతి కలిగించింది. ఆలయదర్శనం తరువాత అంతా చూసి బసకు వచ్చి చేరాము.
గురాలపై యాత్రకు 

డోలీ వాళ్ళు వచ్చి  పైకి తీసుకు వెళతామని మా వెంట తిరుగుతూ  అడుగుతూనే ఉన్నారు. నిర్వాహకులు అందరికీ డోలీలను మాట్లాడి ఏర్పాటు చేసారు. కొంతమంది మాత్రం గుర్రాలను మాట్లాడుకున్నారు. మా బృందంలో స్త్రీలలో చాలామంది ప్రయాణానికి అనువుగా చుడిదార్లు వేసుకున్నారు. 
యాత్ర ఆరంభం 
హోటల్ నిర్వాహం ఆక్సిజన్ సిలిండర్ కొనవలసిన  అవసరమ్ని చెప్పారు. కెదార్నాథ్ ఆలయానికి చేరే వేళకు ఎత్తు, చలి కారణంగా వాయుసంబంధమైన సమస్యలు రావచ్చని అందువలన  ఆక్సిజన్ అవసరమని చెప్పారు. మేమంతా డోలీలు ఉందే ప్రదేశనికి చేరుకున్నాము. అందరం దారిలో తినడానికి బిస్కట్లు వంటివి  జాగ్రత్త చేసుకున్నము. డోలీలు ఎక్కడంటే అక్కడ ఆగవు కనుక సాయంత్రం వరకూ ప్రయాణం చెయ్యాలి కనుక  మద్యలో ఆకలి భరించడానికి వాటి అవసరం ఉంది. ఒక్కో మనిషి ఒక్కో డోలీ కావాలి కనుక ఎవరికి వాళ్ళం వారి వారి డొలీల వద్దకు చేరుకున్నాము.  డొలీ ఎక్కాము అంటే ఇక మా వాళ్ళతో కూడా మాకు మట్లాడే వీళు ఉండదు. ఎందుకంటే  డోలీలు ఒకరి కొరకు ఒకరు ఆగి వెళ్ళడానికి వీలుకాదు. ప్రయాణం అలా ఉంటుంది. డోలీలను  ముందుగా ఊరి మధ్యలో నుండి తీసుకు పోతారు.
గుర్తింపు కార్డుతో నేపాలీ డోలీవాలా 


కేదార్ మార్గం
ముందుగా డోలీ  ప్రయాణం, కేదార్ మార్గం, డోలీ వారి సౌజన్యం చెప్పక తప్పదు.  కేదార్ యాత్రలో వీటీకి అంత ప్రాధాన్యం ఉంది. డోలీలను ఇక్కడ నేపాలీలు తీసుకు వెళుతుంటారు. ఆలయం తెరిచిన ఆరునెలల కాలం  వారు ఇక్కడే నివసించి ఆలయ దర్శనానికి యాత్రీకుల రాక నిలిపిన తరువాత వారి దేశం చేరుకుంటారు. ఇక్కడికి వారు కాలినడకన వచ్చి చేరుకుంటారు. ఆరుమాసాలు వారు ఇక్కడ వారి కుటుంబాలకు దూరంగా గడుపుతారన్న మాట . వీరు అతి సౌజన్యం, స్నేహభావం, సేవానిరతి కలిగిన వారు.  వీరికి చెల్లించే మూల్యం కంటే  వీరి సేవలు అమూల్యమైనవి, మరువరానివి. యాత్రీకులకు కేదార్నాథ్ దర్శనం చేయించే పుణ్యాత్ములు వారు అనక తప్పదు. వారి సేవ  లభించకుంటే మాలాంటి వారికి కేదారనాథుని దర్శనం దుర్లభం అంటే అతిశయోక్తి కాదు. వారు యాత్రీకులను తల్లి తంద్రులలా భావిస్తారు. వీరు నిజాయితీ  పరులు కూడా. భారతీయులలో ఇంతటి నిజాయితీ పరులు లభించడం కష్టమన్న తలంపు మనసును చాలా బాధ కలిగించింది.


కేదార్ మార్గం ఇలా ఉంటుంది 


కేదార్ మార్గం
కేదార్ మార్గం  ఇరుకైనది. కొండల వెంట ఎగుడుదిగుడుగా ఉండే ఇరుకైన మార్గంలో డోలీలు, గురాలు, కాలిబాటన పోయే యాత్రికులు పోయేవారు  వచ్చే వారు ఒక వైపు ఇలా వస్తుంటారు కనుక మార్గం చాలా రద్దీగా ఉంటుంది. ఆ ఇరుకులో డోలీలను మోసే వారు ఎదురుగా వచ్చే వారిని తప్పించుకుంటూ వెళ్ళడం చాలా శ్రమతో కూడుకున్నది. చూసేవారికి ఒకరికి ఒకరు గుద్దుకుంటారన్న సందేహం కలుగుతూ ఉంటుంది.  వారు అంత వేగంగా నడుస్తూ ఉంటారు. అయినప్పటికీ డోలీ వారు అతి లాఘవంగానూ  అదే సమయం వేగంగానూ సాగిపోతూ ఉంటారు. అయినప్పటికీ అటూ  ఇటూ  పెద్ద పెద్ద  లోయలు ఉంటాయి. కింద పడితే ప్రాణాల మీద ఆశ వదులుకోవలసిందే. అయినప్పటికీ అలాంటివి చాలా అరుదుగానే జరుగుతుంటాయి కనుక భయపడ వలసిన అవసరం లేదు.

నలుగు మనుషులు మోసుకు పోయే డోలీలు ఇవే 

నలుగురు మోసుకుపోయే డోలీ 
డోలీలు కూడ చెప్పుకోవలసినట్లు ఉంటాయి. వీటి తయారీకి కొయ్య బద్దలను వాడాతారు. చిన్నగా ఇరుకుగా ఉంటాయి. బాదంకాయ ఆకారంలో షుమారుగా  రెండు అడుగుల ఎత్తులో ఉంటాయి.  వాటిలో ఎక్కాలన్న దిగాలన్నా వారి సహాయం  తీసుకోవాలి. డోలీలలో  ఎక్కి కాళ్ళు ముడుచుకుని కుదురుగా కూర్చోవాలి.  డోలీలకు రెండు  వైపులా పల్లకీలలో ఉండేలా రెండు పొడవాటి లావైన కొయ్యలు  ఉంటాయి  వాటికి అడ్డంగా రెండూ మందపాటి కర్రలను కట్టి వేస్తారు. వాటి సాయంతో యాత్రీకులను నలుగురు మనుషులు మోసుకు పోతుంటారు. రెండు గంటలకు ఒక సారి డోలీని కిందకు దింపి విశ్రాంతి తీసుకుంటారు. రెండు గంటలు కాళ్ళు ముడుచుకుని తరువాత లేవాలంటే కాళ్ళు నొప్పుల కారణంగా సహకరించవు. అప్పుడంతా వారే చెయ్యి అందించి సహకరిస్తారు.

  

కాలినడకలో యాత్రికులు 
తాత్కాలిక రెయిన్ కోట్లలో యాత్రికులు 
మేము డోలీలలో ప్రయాణం మొదలు పెట్టగానే ప్రభుత్వోద్యోగి  రుసుము వసూలు చేసుకోడానికి ఆపాడు ఆయనకు రుసుము చెల్లించాలంటే చేతులు సహకరించ లేదు. రూపాయి నోట్లు ఒక దానితో ఒకటి కరచుకొని విడిగా తీయడానికి సాధ్యం కాలేదు. చలికి చేతులు అంతగా మొద్దుబారి పోయాయి. అప్పుడు ఆయనే పర్సులో నుండి ఇవ్వవలసిన మొత్తం తీసుకుకున్నాడు. అది ఇప్పుడు అనుకున్నా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.  ఇలా ప్రయాణీస్తూ ఆగుతూ టీ, కాఫీలు సేవిస్తూ ముందుకు పోతున్న సమయంలో చిన్నగా వాన మొదలైంది. స్వెట్టర్, గ్లౌజులు వానలో తడిచాయి. అప్పటికి  చలి కొంచెం అలవాటు అయింది కనుక అంతగా కష్టం తెలియ లేదు. అయినా డోలీవారు డోలీ లను ఆపి మాకు ఫ్లాస్టీక్ తో తయారు చేసిన రెయిన్ కోట్లను కొని తెచ్చి తొడుగుకోవడానికి వారే సహకరించారు. 

కొండ చరియలలో యాత్రికులు 

ఎంతగా వారు అలవాటు పడిన వారైనా వారు డొలీని మోయడంలో శ్రమను అనుభవిస్తున్నారని భుజం మార్చుకోవడం భుజం మీద బట్టలు వేసుకోవడం చూస్తే తెలుస్తుంది. నాకు మాత్రం ఇలా మోయించుకోవడానికి చాలా బాధ వేసింది. అయినా ఇంత దూరం వచ్చి కేదారనాథుని  చూడకుండా వెళ్ళడానికి మనసు అంగీకరించక అర్ధమనసుతో యాత్రసాగించాను. ప్రయాణం సాగించినతరువాత ఇంత కంటే ఈ యాత్ర చేయడానికి వేరు మార్గం లేదని తెలుసుకుని కొంత మనసును సమాధానపరచుకున్నాను. రెండు గంటలు ప్రయాణించిన తరువాత డొలీ మోసేవారిలో ఒక వ్యక్తి ఇక మోయలేనని ఆగాడు.  ఇది నా మనసుని మరింత బాధించింది.  మిగిలిన వారు మరొక వ్యక్తిని  ఏర్పాటు చేసుకుని ప్రయాణం కొనసాగించారు. 
మార్గంలో మలుపు తిరుగుతూ 



విశ్రాంతి తీసుకునేది ఇక్కడే 
మార్గ మద్యంలో ఫలహార శాల 
ఒక్కోసారి రాత్రిలోగా పైకి చేరే అవకాశం  లేకుంటే అల్కడ ఉన్న హోటళ్ళలో రాత్రికి విశ్రమించి మరునాడు ప్రయాణం కొనసాగించవచ్చు. కొందరు అలాచేస్తుంటారని తెలుసుకున్నాను. మార్గ మద్యంలో ఉన్న దు కాణలకు కావలసిన అన్ని వస్తువులూ దాదాపు ఇలా నడక ద్వారానే చేరవేయాలి. ఇక్కడి వారిది అత్యంత శ్రమైక జీవితం. శ్రమించనిదే ఎవరికీ జీవితం గడవదు. మార్గంలో ఉన్న దుకాణాలన్నీ తాత్కాలిక మైనవే. ఆరుమాసాల అనంతరం ఖాళీ చేయబడతాయి. వాటి నిర్మాణానికి అవసరమైన సామాను పైకి చేర్చడం ఎంత కష్టమో ఆలోచించండి. వీరితో పోల్చుకుంటే ఎంతో వసతులతో జీవితాన్ని గడిపే మనలో కొంతమంది ఇంకా కావాని ఆరాటపడడం ఉన్నదానితో తృప్తి చెందక పోవడం ఎంత విచిత్రమైనదోకదా. 



పచ్చని సెలయేళ్ళు  కొండచరియలు




ఏటవాలు భూములలో వ్యవసాయక్షేత్రాలు 
ఆహ్లాదకరమైన జలపాతాలు 
ప్రయాణం ఎంత బడలికగా ఉన్నా చుట్టూ ఉన్న పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉన్నాయి. తరుచుగా దూరంగా జలపాతాలు  కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మన ప్రాంతంలో అయితే  ఒక్క జలపాతం ఉంటే దానిని పర్యాటక కేంద్రం చేసి  ఎంత మంది పర్యాటకం చేయడానికి  వెళుతుంటారు. కాని ఇక్కడ వాటిని అంతగా పట్టించుకునే వారే లేరు. దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన  కొండల మీద దేవదారు వృక్షాలు కనిపిస్తున్నాయి. బద్రీనాథ్ పర్వతాలకంటే ఇక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంది. అది మనసుకు మరింత ఆహ్లాదం కలిగించింది. ఒక్కో చోట దూరం నుండి హిమశిఖరాలు కూడా కనిపిస్తున్నాయి. పర్వతాల ఆఖరి భాగాలలో హిమమయయం గానూ కింది భాగంలో మామూలుగాను ఉంటుంది.  


మార్గమద్యంలో 

ఒక్కోసారి రాత్రిలోగా పైకి చేరే అవకాశం  లేకుంటే అల్కడ ఉన్న హోటళ్ళలో రాత్రికి విశ్రమించి మరునాడు ప్రయాణం కొనసాగించవచ్చు. కొందరు అలాచేస్తుంటారని డోలి వారిని అడిగి  తెలుసుకున్నాను. మార్గ మద్యంలో ఉన్న దుకాణలకు కావలసిన అన్ని వస్తువులూ దాదాపు ఇలా నడక ద్వారానే చేరవేయాలి. ఇక్కడి వారిది అత్యంత శ్రమైక జీవితం. శ్రమించనిదే ఎవరికీ జీవితం గడవదు. మార్గంలో ఉన్న దుకాణాలన్నీ తాత్కాలిక మైనవే. ఆరుమాసాల అనంతరం ఖాళీ చేయబడతాయి. వాటి నిర్మాణానికి సామాను పైకి చేర్చడం ఎంత కష్టమో ఆలోచించండి. వీరితో పోల్చుకుంటే ఎంతో వసతులతో జీవితాన్ని గడిపే మనలో కొంతమంది ఇంకా కావాని ఆరాటపడడం ఉన్నదానితో తృప్తి చెందక పోవడం ఎంత విచిత్రమైనదోకదా.
ఒకే మనిషి మోసే దోలి ఇలా ఉంటుంది

కాలినడకలో యాత్రికులు 
ఇలా కొంతదూరం పోయే సమయానికి  డోలీలో పోతున్నా అందరూ వాడి  పోయారు.  ఒక్కో సారి మా బృందం వారు ఎదురైనా గమనించే స్థితిలో కూడా లేము. కొంతమంది యాత్రికులను బుట్టలలో  మోసుకు పోతున్నారు.  టీ తోటలలో ఉపయోగించే బుట్టలలో మనిషిని కూచోబెట్టుకుని వీపుకు తగిలించుకుని తీసుకు పోతుంటారు. ఒక మనిషిని ఒకరు మోసుకు పోతారు. ఇక్కడ ఈ బుట్టలను సామాను మోయడనికి కూడా వాడడం చూసాము. చిత్రమేమిటంటే మొసే వారి కటే  కుర్చున్న వారు అలసటతో వాలి పోతున్నారు.  ఇంకా విచిత్రం ఏమంటే మా కంటే వయోధికులు చక్కగా చేకర్రల సాయంతో నడిచిపోతూ ఉండడమే. 
మార్గ మద్యలో రమణీయమైన దృశ్యాలు 


ఇంకా ముందుకు పోయిన తరువాత మా బృందం వారు వెనక్కి రావడం గమనించాను. వారు ఈ ప్రయాణం కొనసాగించ లేక వెనుతిరిగారని తరువాత తెలిసింది.  ఇలా మా బృందం వారు 11 మంది వెనుతిరిగారు. అయినప్పటికీ  నేను మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆఖరి వరకూ ప్రయాణం కొనసాగించాలని నిర్ణ యించుకున్నాను. 
మంచుదుప్పటి కప్పుకున్న శిఖరాలు 

రెయిన్ కోటు  వేసుకున్న  తరువాత  వాన నుండి తప్పించున్నా విసురుగా వీస్తున్న  గాలి ఇబ్బంది పెట్టసాగింది. గాలికి  రెయిన్  కోటు తలమీద నిలవడం  కష్టమైంది. వాన  చినుకులు ఏటవాలుగా  కురుస్తూ  సూదులులా  గుచ్చుతున్నాయి. ఇంతవరకూ  ఇలాంటి  వాన చూడ లేదు.  వేగంగా  ఏటవాలుగా కురవడం  వలన  ఇలా  ఉందేమో . ఒకచేత్తో  రెయిన్ కోటు  సరిచేసుకుంటూ  ఒక చేయి  ముఖం  మీద  పెట్టుకుని  వాన నుండి  కాపాడుకోవలసి  వచ్చింది. క్రమంగా  వాన మంచుగా  మారింది. ఇప్పుడు  ముఖం  మీద మంచు  ముద్దలు  ముద్దలుగా  పడుతూ  కరిగిపోతూ  ఉంది.  చలి  వానలకు  శరీరం  కొద్దిగా  అలవాటు  పడింది. ఇప్పుడు అంతగా  ఇబ్బంది అనిపించ  లేదు.  ఇక్కడే  నివసిస్తే  ఈ వాతావరనానికి  అలవాటు  పడడం సులువులా  ఉంది.  డోలి వారు  ఇక  ఆలయానికి చేరువ ఔతున్నామని  మహాదేవుడిని స్మరిస్తూ  ఉండమని  చెప్పారు. నాకు తట్టని  విషయం వారు  చెప్పినందుకు  వారి  మీద సదభిప్రాయం  మరింత  ఎక్కువైనది.  మహేశ్వరుని  స్మరిస్తూ  కేదార్నాథ్  చేరడం  మరింత  అనందానుభుతి  కలిగించింది. ఇలా  చిన్నగా  శిఖరానికి చేరుకున్నాము.
శిఖరానికి చేరువ ఔతూ 

     
ఆలయానికి  షుమారు  రెండు కిలోమీటర్ల  దూరంలో  డోలి ఆపి వెళ్ళాలి  కనుక  డోలిలను  ఆపి  ఇక నడవాలని  చెప్పారు.  మా బృందం  వారు ఎవరూ కనిపించ  లేదు. ఇంత  కొత్త  ప్రదేశంలో  ఇలా  ఒంటరిగా  ఉండడం  ఇదే  మొదటి  సారి. ఏమి  చేయాలో  పాలు  పోలేదు. డోలి వారిలో  ఒకరు  నాతో  అందోళన  అవసరం  లేదని  తను  వెంట  వస్తానని  చెప్పాడు.   పరిచయం లేని  వారితో  ఇలా ప్రయాణం  చేయవలసి  రావడం  వింతగా  ఉన్నా  వారు చూపిన  ఆప్యాయత  మాత్రం కొత్తదనాన్ని పారదోలింది. ఇలా వారు యాత్రికులు అందరికీ  దర్శనం చేసే వరకు వెంట ఉండి సాయం చెస్తుంటారు.

ఆలయంలో ప్రవేశిస్తున్న భక్తులు 
ఆలయనికి వెళ్ళే  దారికి ఇరువైపులా పుజాసామానులు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ముందుగా వైద్య శిబిరం ఉంది. అక్కడ యాత్రుకులకు ప్రయాణం వలన ఎదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేస్తారు. వెంట తీసుకు వెళ్ళిన అక్సిజన్ కావాలంటే ఉపయొగించుకోవడానికి  అవసరమైన సహకారం కూడా అందిస్తారు.  నాకు మాత్రం ఏమీ అవసరం అనిపించ లెదు. దారికి ఇరువైపులా మంచు అరుగులుగా పేరుకుని ఉంది.  అక్కడ కురిసే మంచును నెట్టి పెట్టడం వలన ఆ మంచు దిబ్బలు ఎర్పడ్డాయి. అంత ఎక్కువగా మంచును అంత సమీపంగా చూడడం అదే మొదటిసారి. ఆ చలికి ముక్కు ఎక్కువగా బిగుసుకు పొవడం వలన కుడా  కఫ బాధ ఎమి లేదు. గాలి చక్కగా పీల్చగలగడం ఆశ్చర్యాన్ని హాయిని కలిగించింది. 



కేదారీశ్వరాలయం ముందు 
కేదారీశ్వరుడు 
నివాస గృహాల మద్యలో కేదార్నాథ్ ఆలయం 
అలయానికి చేరగానే మాబృందం వారు ఒక్కరు ఒక్కరుగా కనిపించ సాగారు.  వారు నన్ను ఆలయానికి రమ్మని పిలిచారు. నేను మాత్రం మా వారి కొరకు ఆగాను. కొంచెం సమయానికి మా వారు రాగానే ఇద్దరం ఆలయం లోనికి ప్రవేసించాము.  మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి ఎక్కడం చాలా శ్రమ అనిపించింది.  చిన్నగా పైకి ఎక్కి ఆలయంలో ప్రవేశించాము.  ఆలయం చాలా చిన్నది. మహ ఋషులు  ఆరాధించిన ప్రదేశం ఈశ్వరుడు ప్రత్యక్షమైన దివ్యస్థలం, పాండవులు సేవించిన పవిత్ర క్షేత్రం, శంకరాచార్య పూజితం. అసలు నా జీవితంలో ఈ ఆలయాలు చుస్తానని అనుకో లేదు. ఇలా ఈ ఆలయదర్శనం చేసుకోవడం జీవితంలో మరువ లేనిది.  ఇంత శ్రమతో చూడడం మరింత ఆనందానుభూతిని ఇచ్చింది. గర్భాలయంలో ప్రవేశించే ముందు ఉన్న మందిరంలో  చుట్టూ ఉన్న గోడలకు పాండవులు, కుంతీ, ద్రౌపది, శ్రీకృష్ణుల చిత్రాలు ఉన్నాయి. గర్భాలయంలో ఈశ్వరుడి మీద వస్త్రం కప్పి ఉంది. ఇక్కడ ఈశ్వరుడు స్వయంభులింగం మానవ ప్రతిష్టితం కాదు. ఆలయ దర్శనం చేసుకుని తిరుగు ముఖం పట్టాము. ఇప్పుడు వాన తగ్గింది.
కొండ చరియల మద్య కేదార్నాథ్ ఊరు 

అక్కడ యాత్రికులకు మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉంది. అందరం మామా అవసరాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశంలో మంచు దిబ్బలు మరింత పెద్దవిగా ఉన్నాయి. అవి మట్టితో కలిసి కొంచెం ఎర్రగా ఉన్నాయి. అంత మంచును ఒక్కసారిగా చూడడం అదే మొదటిసారి. అదరం కలిసి నడుచుకుంటూ డోలీ నిలిపిన ప్రదేశానికి చేరుకుని తిరుగు ప్రయాణం సాగించాము. తిరిగి ఎవరికి వారుగా విడిపోయి  తిరుగు ప్రయాణంలో అక్కడక్కడా హోటళ్ళలో ఫలహారాలు తిని కాఫీ, టీలు త్రాగాము. ఈ హోటలులో అధికంగా పూరీ చపాతీలతో నూడిల్స్ ఆహారంగా తింటున్నారు.  తిరుగు ప్రయాణంలో డొలీ వారితో మాట్లాడుతూ ప్రయాణం సాగించాను. వారు వారి పిల్లల చదువుకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరని పనిపాటలకే అధికంగా ప్రధాన్యత ఇస్తారని తెలుసుకున్నాను.  వారి స్త్రీలు వీరు వెళ్ళే వరకు కుటుంబ పోషణ చూసుకుంటారని చెపారు. . తిరుగు ప్రయాణంలో వాన కాని మంచుగాని లేదు.  వాన, ఎండ, మంచు మారి మారి ఉండడం ఇక్కడ సహజంలా ఉంది. ఈ వాతావరణం కొంత అలవాటు కావడంతో తిరుగురయాణం అంతగా ఇబ్బంది కరంగా లేదు. ఇలా ప్రయాణాం చేస్తూ కిందకు చేరడానికి సాయంత్రం ఆరు గంటలు దాటింది. 

కేదార్ ఆలయ పరిసరాలు 


కిందికి  రాగానే నన్ను మారి వద్దకు చేర్చి నిర్వాహకుల వద్ద వారికి రావలసిన ధనం తీసుకుని వారు వెళ్ళారు. ఇంత వరకూ ఆత్మీయతగా మాతాజీ అని మెలిగిన వారు నిశ్శబ్ధంగా వెనుతిరిగారు. వారి వృత్తి ధర్మం వారిది. మా యాత్రా ధర్మం మాది.  ఆ రాత్రి భోజన సమయంలో అందరూ వారి వారి అనుభవాలు చెప్పుకున్నారు.  అందరూ డోలీ వారి సేవలను శ్లాఘించిన  వారే. ఎవరూ వారికి అదనంగా పెట్టిన ఖర్చు కొరకు ఎవరూ బాధపడక పోవడం విచిత్రం. సాధారణంగా అదనపు ఖర్చుఅ విషయంలో ఇలా ఏకాభిప్రాయం కుదరదు. 




గురాలమీద యాత్ర 
గురాల మీద స్త్రీయాత్రికులు 
మా బృందంలో కొంతమంది గురాల మీద వెళ్ళారు. వారిలో ఒక స్త్రీ గుర్రం మీద నుండి కిందకు పడి తలకు గాయం అయింది. హాస్పిట వెళ్ళి కట్టు కట్టించుకుని తీసుకు వచ్చారు. వాస్తవానికి నాకు డోలీలలో అలా మోయబడడం మనస్కరించక గురం మీద వెళాలని అనికున్నాను. మావారు  అ దుకు అంగీకరించ లేదు. అది ఎంత మంచిదో ఇప్పుడు అర్ధం అయింది. గురాం వెంట యాత్రీకులతో ఒక వ్యక్తి నడుస్తూ వస్తాడు. అతడు గుర్రాన్ని అదుపు చేయడం మేత వేయడం నీరు త్రాగిం చడం వంటివి చెస్తుంటాడు. అయినప్పటికీ అక్కడాకాడా వాటి కొరకు ఏర్పాటు చేసిన నీటి తొట్టి చూసాయంటే అయి వేగంగా పరిగెడతాయి. అల్ల పరిగెత్తే సమయంలో ఆమె ఆందోళన చెంది పడిపోయానని చెప్పింది. కేదార్ మార్గం అక్కడక్కడా ఈ గుర్రాల మలమూత్రాల వలన చితచితగా ఉంటుంది.
కేదార్ కొండ ప్రాంతం 


మాయాత్రలో కేదార్ యాత్ర మకుటాయ మయమని చెప్పవచ్చు. కేదార్నాథుని దర్శనం అంతటి విచిత్రమైన అనుభూతిని ఇచ్చింది. ఎందరికో జీవిత కాలంలో లభించని ఆలయ దర్శనం ఈశ్వరుడు మాకు ప్రసాదించినందుకు మనసులోనే కృతఙత తెలిపుకున్నాను. మరునాడూ ఉదయం మేము యమునోత్రికి మా యాత్ర కొనసాగించాం.
కేదార్ యాత్రలో హెలికాఫ్టర్లు 

కేదార్ యాత్రకు హెలికాఫ్టర్లు లభ్యం ఔతాయి. వాటిని ముందుగా కొన్ని మాసాల ముందు బుక్ చేయాలి .  మాయాత్రలో ఆ ప్రణాళిక లేదు కనుక మా కవి లభ్యం కాలేదు. హెలికాఫ్టర్లలో వెళ్ళినా మూడు కిలోమీటర్ల దూరమైనా దోలి ప్రయాణం ఉంటుందని తెలిసింది. హెలికాఫ్టర్లు గౌరీ కుండ్ నుండి లభ్యం ఔతాయి. మార్గంలో హెలికాఫ్టర్లు పోవడం గమనించాము. అయినప్పటికీ   ఈ మార్గంలో పోవడం ఈ అనుభవం మేము చక్కగా ఆశ్వాదించాము.

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

విభిన్న సంప్రదాయాలు

విభిన్న సంప్రదాయాలు 

File:Kreung cabins of unmarried.jpg
ఇదే క్రెయింగ్ ప్రజలు తమ ఆడపిల్లల కొరకు నిర్మించిన నివాసము 

కొరియాలోని రతనకిరి ప్రంతంలోని క్రెయింగ్ తెగ ప్రజలకు ఒక వింత సంప్రదాయం ఉంది.  ఈ తెగలోని ప్రజలు యువతీ యువకులు ఒకరిని ఒకరు చక్కగా అర్ధం చేసుకున్న తరవాతనే వైవాహిక జీవితంలో ప్రవేసించడాన్ని ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా వారు యువతీ యువకులకు పూర్తి  స్వేచ్చను ఇస్తారు. వివాహానికి ముందు వారు వారికి నచ్చిన వారితో కొత కాలం  కలిసి జీవించిన తరువాత వారిరువురికి పరస్పరం  నచ్చిన తరువాతనే వివాహజీవితంలోకి ప్రవేశించే వీలును కుటుంబ సభ్యులే కల్పిస్తారు. 


ఈ విధానంలో ఒక భాగంగా అమ్మాయిలు వయసుకు వచ్చిన తరువాత  ఇంటి వెనుకభాగంలో ఒక మంచెను ఏర్పాటూ చేసి దాని మీద ఆకులు గడ్డితో చిన్నకుటిరాన్ని  అందంగా పక్షి గూళ్ళలా నిర్మిస్తారు. తరువాత ఆ అమ్మాయి అందులో నివసించడనికి అనుమతిస్తారు. ఇలా చేయడం ద్వారా యువతీ యువకులకు కుటుంబానికి మద్య ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఆ కుటీరంలో వారు వారికి నచ్చిన యువకులుతో సహజీవనం చేయవచ్చు. అయినప్పటికీ వారికి నచ్చిన యువకుడు లభించిన తరువాత అప్పటి  వరకూ స్నేహం చేసిన వారితో తెగతెంపులు చేసికొని నచ్చిన యువకుడిని  వివాహం చేసుకుంటరు. ఒక్కో సమయంలో అమ్మయిలు ఒకరికంటే  అధికమైన యువకులతో కూడా స్నేహం చేస్తుంటారు. 

వివాహానికి ముందు యువతులు గర్భం ధరించకుండా ఒక రకం చెట్తు నుండి తీసిన రసం త్రాగే గ్రాగే వారు.  ప్రస్తుత కాలంలో ఆధునిక గర్భనిరోధక వ్యూహాలను అనుసరిస్తున్నారు. వివాహానికి పూర్వం సంతానం  పొందడం కూడా సంభవిస్తూ ఉంటుంది. పరస్పం అంగీకరిస్తే ఆ శిశువు తండ్రితో  వివాహం జరిపిస్తారు. అలా జరగకున్నా వివాహం చేసుకున్న యువకుడు ఆశిశువుకు తండ్రిలా బాధ్యత తీసుకుంటాడు.  ఈ  విధానం కారణంగా శిశులను చెత్తకుండీలలో పారవేయడం కాని భ్రూణ హత్యలకు కాని ఈ తెగలో తావు లేదన్నమాట. 

ఈ విధానం కారణాంగా వారిలో వివాహం తరువాత విభేధాలు తక్కువగా ఉంతాయి. దీర్ఘ కాల వైవాహిక జీవితం కొనసాగుతుంది. వీరిలో వివాహానంతరం విడిపోయే వారి శాతం స్వల్పం. వీరిలో భార్యా భర్తల మధ్య అపార్ధాలు అనుమానాలు ఆత్మహత్యలు హత్యలు అత్యాచారాలు వంటివి లేవు. ఆకర్షణే ప్రేమ అనుకుని వివాహం చేసుకుని  తరువాత సమస్యలతో విడిపోవడం కంటే ఇది మేలన్నది వీరి అభిప్రాయం.  ఆధునిక సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాకున్న సమ్యలు తక్కువగా ఉన్న వైవాహిక సంబంధాలలో ఇది ఒకటి అని భావించ వచ్చు. 

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

గంగోత్రి




File:Gaumukh Gangotri glacier.jpg
గోముఖ్ వద్ద గంగోత్రి 


File:Nanda Devi, from Joshimath.jpg
జోషీ మఠ్ వద్ద మనోహరంగా కనబడుతున్న నందాదేవీ శిఖరం 
File:Ropeway at Joshimath, Uttarakhand.jpg
జోషి మట్ వద్ద ఉన్న రోప్ వే 


బద్రీనాథ్ నుండి మేము బయలుదేరి తిరిగి జోషిమఠ్ చేరుకున్నాం. జోషిమఠ్ వద్ద ఉన్న భవిష్య బదరీనాథ్ ఆలయం చూడడానికి బస్సును ఆ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆపారు. హిమాలయ ఘాట్ మార్గంలో అన్ని ప్రదేశాలలో బసులు నిలపడానికి కావలసినంత విశాలమైన ప్రదేశం లభ్యం కాదు కనుక బసులను మార్గం వెంట ఒకదాని వెంట ఒక దానిని నిలుపుతూ ఉంటారు. అలా నిలిపే సమయంలో ఒక్కో సమయంలో మనం చూడవలసిన ప్రదేశానికి  3-4 కిలోమీటర్ల దూరంలో ఆపవలసిన అవసరం ఉంటుంది. ఇక చేసేది లేక కళ్ళకు బుద్ధి చెప్పి అందరం నడక సాగించాం. ఘాటు మార్గం ఎగుడు దిగుడు మధ్య మూడు కిలోమీటర్ల దూరం నడకకు అందరం అలసి పోయాము. కానీ మాకంటే వయసైన కొందరు అలసట చెందక పోవడం కొస మెరుపు. చిన్నగా మేము భవిష్య బదరి ఆలయం చేరుకున్నాము.
జోషి మఠ్ వద్ద నరసింహ ఆలయం 
జోషి మత వద్ద శంకరా చార్యుల మఠం 

భవిష్యత్తులో బద్రీ నాథ్ మార్గం మూత పడవచ్చని అప్పుడు జోషి మఠ్ ఆలయం బద్రీనాథ్ ఔతుందని అష్టాదశ  పురాణాలలో ఒకటైన భవిష్య పురాణంలో పేర్కొనబడింది. అప్పుడు బద్రి నాథు నికి పూజలు ఇక్కడే జరుగుతాయని ఋషి వాక్కు సూచిస్తూ ఉంది. ప్రస్తుతం శితా కాలంలో  బద్రి నాథ్ ఆలయం ముసి వేసిన తరువాత బద్రీనాథ్ స్వామికి పూజాదికాలు ఇక్కడ నిర్వహించ బడుతూ ఉంటాయి. మేము ఆలయ దర్శనం చేసి తరువాత పక్కనే ఉన్న 
ఆది శంకరా చార్యుల మఠాన్ని సందర్శించాం. వేణు తిరిగి పోతున్న సమయంలో నిర్వాహకులు మాకొరకు వ్యానులు మాట్లాడుకుని తీసుకు వచ్చారు. మాకు వాటిని చుసి ఉత్సాహం వచ్చింది. ఏదో ఆసక్తి తో వచ్చాం కాని తిరిగి వెళ్ళే ఓపిక అంతగా లేదు.  ఇక అక్కడి నుండి బయలుదేరి రాత్రి సమయానికి ఉత్తర కాశి చేరుకున్నాము.మా తరువాత ప్రణాళిక గంగోత్రి చూడడం. అందుకని ఉత్తర కాశిలో బస చేసి మరుసటి రోజు గంగోత్రి వెళ్ళాలి.

File:DraupadiKaDanda-HimalayanPeak-Garhwal,India.jpg
ఉత్తర కాశి లో ఉన్న ద్రౌపదీ కా దండా శిఖరం


File:Trek to Gaumukh.jpg
గోముఖ్ పర్వత మార్గం 
ఇదే గంగాదేవి ఆలయం


 ఉత్తర  చేరుకొని ఆరాత్రికి విశ్రమించి మరునాడు ఉదయానికి మేము తిరిగి గంగోత్రికి బయలు దేరాం. అలా బసులో ప్రయాణం చేసి షుమారు 3-4 లోపల గంగోత్రికి చేరుకున్నాము. గంగోత్రికి కుడా మూడు కిలోమీటర్ల దూరంలో బసు ఆగింది. అక్కడి నుండి చిన్నగా కాలి నడకన గంగోత్రి చేరుకున్నాము. గోముఖ్ శిఖరానికి దిగువన గంగా నది చిన్న ప్రవాహ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తవానికి గంగానది జన్మస్థానం గుముఖ్ శిఖరం. అక్కడకు సన్యాసులు, పర్వతారోహకులు కాలినడకన చేరుకుంటారు. అక్కడ గంగాదేవి హిమరుపంలో ఉంటుంది . గగాదేవి ఆలయానికి దాదాపు 40-50 కిలోమీటర్ల ఎగువగా అది ఉంటుంది. మేము ఎలాగైనా అక్కడకు వెల్ల లేము కనుక. దిగువన ఉన్న గంగాదేవి ఆలయం చూసి వేనుతిరగాలన్నది మా ప్రణాళిక. ముందుగా పూజ సామాను కొని నది వద్దకు చేరుకున్నాం. ఉన్న బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకుని, అక్కడ స్త్రీలు అమ్ముతున్న దీపం  కొనుక్కుని గంగానదిలో వదిలి కాళ్ళు  కడుక్కుని గంగాజలం తల మీద చల్లుకున్నాం. 

File:Bhagirathi River at Gangotri.JPG
ఇదిగో ఇదే గంగోత్రి 

గంగోత్రిని అలా సంభ్రమంగా చూస్తూ ఉండి పోయాం. గంగాజలం చిన్న చిన్న రాళ్ళను దొర్లించు కుంటూ పై నుండి వేగంగా కిందికి దిగివస్తూ దర్శనం ఇచ్చింది. రాళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. కాళ్ళు  కూడా జాగరూకత వహించి కడుగు కోవాలి. అలా చేయకుంటే కాళ్లు చీలిపోయే ప్రమాదం ఉంది. మా బృందంలో ఒకావిడకు కాళ్ళు కడిగే సమయంలో దెబ్బ తగిలి రక్తం కారింది. అంత పదునుగా ఉంటాయి అక్కడ రాళ్ళు. గంగా నది ఆరంభ స్థానం కనుక  నీళ్ళు అంత లోతు ఉండదు. అయినప్పటికీ నీళ్ళలో మట్టికరిగి ఉంటుంది కనుక గంగా జలం లేత గోధుమవర్ణంలో ప్రవహిస్తుంది. గంగాజలం చాలా చల్లగా జిల్లున ఉన్నాయి. అక్కడ అంతగా స్నానం చేయరు. కాని అంత చల్లని జలాలలో వయసైన ఆవిడ ఒకామె స్నానం చేయడం కొసమెరుపు. గంగోత్రి దర్శనం పూర్తి చేసుకుని మేము పక్కనే ఉన్న గంగా దేవి ఆలయానికి చేరుకున్నాం. 
File:Gangothri.jpg





ఇదిగో ఇదే గంగీత్రి వద్ద గంగాదేవి ఆలయం. ఆలయం చేరుకుని అక్కడ గంగాదేవికి పూజాదికాలు ముగించుకుని మెల్లగా వెలుపల  ఉన్న భాగీరధుడిని దర్శించుకున్నాము.ఆలయం పక్కగా భగీరధుడికి చిన్న మందిరం ఉన్నది. గంగాదేవి భూమికి దిగిరావడానికి కారణమైన భగీరధుడికి ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తుంటారు . ఇలా గంగోత్రి దర్శనం పూర్తి అయింది. అక్కడ నుండి కదిలి వెళ్ళాం. అక్కడ ఆరుగంటల తరువాత గంగానదికి హారతి ఇస్తారని అన్నారు. అది చూడాలని ఉన్నా తరువాత బసు వద్దకు నడిచి వెళ్లి బసక చేరుకోవడానికి ఆలస్యం ఔతుంది కనుక హారతి చూడకుండానే వెనుతిరిగాం. తిరిగి బసు వద్దకు నడిచి వెళ్లి బసకు చేరుకున్నాం. 

9, జనవరి 2013, బుధవారం

ఋషికేశ్

File:Rishikesh view across bridge.jpg
ఋషికేశ్ 

ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
File:Shiva in rishikesh.jpg
గంగాతీరంలో ధ్యానంలో శివుడు 

తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే  వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. 
File:Sivananda Temple, Divine Life Society, Muni Ki Reti, Rishikesh.jpg
 శివానందాశ్రమం
File:Kailash Ashram, Muni Ki Reti, Rishikesh.jpgFile:Shiva statue at Parmarth Niketan, Muni ki Reti, Rishikesh.jpg మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని.  కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే  వినాయకుడు తొండం  పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి.  ఆశ్రమంలో  మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు.  గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.



File:Ram Jhula bridge on the Ganges, Muni Ki Reti, Rishikesh.jpg
రామ్ ఝులా
File:Close up of Pilgrims on Ram Jhula bridge, Rishikesh.jpgFile:Ram Julah Hanging Bridge, Rishikesh, India.jpgకైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా  జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది.  ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం
File:Trayambakeshwar.JPG


రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా  చూసి తీరాలని 
అనుకున్నాము.
File:A monkey crossing the Laxman Jhula bridge, Uttarakhand.jpg
లక్ష్మణ ఝులా 

అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి  లక్ష్మణ ఝులా ఉండే  ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత  వంతెన నిర్మాణం 1939లో జరిగింది.  తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే. 


నాభాస యోగాల


నాభాస యోగాల



నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.
  • నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
  • ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
  • ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
  • ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
  • కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
  • ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
  • కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
  • ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
  • యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
  • ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
  • శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
  • ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
  • శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
  • ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
  • దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
  • ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
  • అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
  • గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
  • ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
  • వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
  • ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
  • యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
  • ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
  • పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
  • ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
  • వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
  • ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
  • శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
  • ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
  • విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
  • ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
  • వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
  • ఫలితం :-
  • శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
  • ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
  • చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
  • సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
  • సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
  • ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
  • ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
  • ఫలితం :-
  • రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
  • ఫలితం :-
  • గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
  • ఫలితం :-
  • యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
  • ఫలితం :-
  • శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
  • ఫలితం :-
  • కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
  • ఫలితం :-
  • పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
  • ఫలితం :-
  • దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
  • ఫలితం :-
  • వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.
  • ఫలితం :-

నాభాస యోగాల


నాభాస యోగాల



నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.
  • నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
  • ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
  • ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
  • ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
  • కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
  • ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
  • కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
  • ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
  • యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
  • ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
  • శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
  • ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
  • శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
  • ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
  • దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
  • ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
  • అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
  • గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
  • ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
  • వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
  • ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
  • యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
  • ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
  • పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
  • ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
  • వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
  • ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
  • శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
  • ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
  • విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
  • ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
  • వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
  • ఫలితం :-
  • శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
  • ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
  • చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
  • సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
  • సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
  • ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
  • ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
  • ఫలితం :-
  • రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
  • ఫలితం :-
  • గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
  • ఫలితం :-
  • యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
  • ఫలితం :-
  • శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
  • ఫలితం :-
  • కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
  • ఫలితం :-
  • పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
  • ఫలితం :-
  • దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
  • ఫలితం :-
  • వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.
  • ఫలితం :-

2, జనవరి 2013, బుధవారం

జ్యోతిర్మార్గం


జ్యోతిర్మార్గం 

జ్యోతి అంటే వెలుగు. జ్యోతిషం వెలుగును ఆధారంగా చేసుకున్న పరచిన శాస్త్రం. అనేకులు విశ్వసించేది కొందరు విమర్శించేది. ఏది ఏమైనా దీనికీ విశ్వాసం మాత్రమే ఆధారం. ఇందులో గోచారం   ఒక పధ్ధతి. గోళాల సంచారం ఆధారం చేసుకుని నిర్ణయించేది.  దీనిని సంత్సర, మాస,  వార, దిన ఫలితాలు చూడడానికి ఉపయోగిస్తారు. గోచార ఫలితాలు చూడదానికి రాశీ నుడి గణించాలి.  జీవితకాల ఫలితాలు చూడడానికి లగ్నం నుండి లెక్కించాలి.  జ్యోతిషం చూడాలంటే ప్రధానంగా అనే క విషయాలను గణించాలి.
ముందుగా రాశులు. ఇవి పన్నెండు.
సూర్యుని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం చేస్తారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశిలో ప్రవేసించే సమయం సంక్రమణగా వ్యవరిస్తారు. సూర్యుని చుట్టు భూమి చేసే భ్రమణాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే వచ్చినవే పన్నెండు రాసులు. ఒక్కక్క రాశిలో ప్రవేశించే సమయయంలో ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహాలలో ఉండే మార్పులను బట్టి అవి వేరు వేరు నక్షత్రాలని మన ఋషులు పరిశీలింవి గుర్తించారు. అ నక్షత్ర సముహ ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయించారు. 

వాటిలో మొదటిది మేషం., రెండవది వృషభం, మూడవది మిధునం, నాల్గవది కటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, ధనుస్సు, పదవది మకరం, పదకొండవది కుంభం, పన్నెండు మీనం.

1 మేషం రాశిలో అశ్విని నక్షత్ర నాలుగు పదాలు, భరణి నక్షత్రలో నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రలో మొదటి పాదం కలసి తొమ్మిది పాదాలు.
2 వృషభ రాశిలో మిగిలిన మూడు పదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు ఉంటాయి.
3 మిదునరాశిలో మృగశిరలోని రెండు పాదాలు, ఆరుద్రలోని నాలుగు పాదాలు, పునర్వసులోని మూడు పాదాలు ఉంటాయి.
4 కటకరాశిలో పునర్వసు నక్షత్రంలోని నాల్గవ పాదం, పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి.
5 సింహరాశిలో మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని నాలుగు పాదాలు , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని ఒక పాదం ఉంటాయి. 
6 కన్యారాశిలో ఉత్తరఫల్గుణి నక్షత్రంలోని మిగిలిన మూడు పాదాలు, హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు, చిత్త నక్ష త్రంలోని రెండు పాదాలు ఉంటాయి.
7 తులారాశిలో చిత్తానక్ష త్రంలోని మిగిలిన రెండు పాదాలు, స్వాతి నక్ష త్రం లోని నాలుగు పాదాలు, విశాఖనక్ష త్రం లోని మూడు పాదం ఉంటాయి.
8 వృశ్చికరాశిలో  విశాఖ నక్ష త్రం లోనిమిగిలిన ఒక్క పాదం , అనురాధ నక్ష త్రం లోనినాలుగు పాదాలు, జ్యేష్ట నక్ష త్రం లొనినాలుగు పాదాలు ఉంటాయి.
9 ధనుసు రాశిలో మూలా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్ష త్రం లోని ఒక్క పాదం ఉంటాయి.
10 మకరరాశిలో ఉత్తరాషాడలోని మిగిలిన మూడు పాదాలు, శ్రవణా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ధనిష్ఠ నక్ష త్రం లోని రెండు పాదాలు ఉంటాయి. 
11 కుంభ రాశిలో ధనిష్ఠ నక్ష త్రం లోని మిగిలిన రెండు పాదాలు, శతభిష నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్ష త్రం లోని మూడు పాదాలు ఉంటాయి.
12 మినరాశిలో పుర్వభద్ర నక్ష త్రం లోని ఒక్క పాదం, ఉత్తరాభద్ర నక్ష త్రం లోని నాలుగు పాదాలు, రేవతి నక్ష తరం లోని నాలుగు పాదాలు ఉంటాయి.
ఇలా పన్నెండు రాశులలో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి.