30, మే 2012, బుధవారం

అమరనాధ్

 అమరనాధ్ యాత్ర

Cave Temple of Lord Amarnath.jpg
అమర్నాథ్ గుహ ముఖద్వారం

అమరనాథ్ స్థలపురాణం

హిందువులు కోరుకునే యాత్రలలో అమరనాధ్ యాత్ర ఒకటి. అమరనాధుడంటే జరామరణములు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో " నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను " అని బదులిచ్చాడు. పార్వతీ దేవి " నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నవు ఇది ఎలా సాధ్యం " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పలి " అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కొరకు వెతకి చివరకు ఈశ్వరుడు  అమరనాధ్ గుహను ఎంచుకున్నాడు. పహల్ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్ళాడు, షిషాంగ్ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు, మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు, తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమనాధ్ గుహలోపలికి వెళ్ళాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వరహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాలజంట ఈ  రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయి. ఇప్పటికీ భక్తులకు ఆ పావురాల జంట దర్శనం ఇస్తాయి. అని వినికిడి.

అమర్నాథ్ యాత్రీకుల శిబిరాలు

 

వేరొక కధనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహిపజేసాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణ కధనాలు చెప్తున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. అప్పటి నుండి ఇక్కడకు లక్షలాది భక్తులు వచ్చి శివారాధన చేసి శాశ్వమైన పరమానందం అనుభవిస్తున్నారు. భక్తులు ఇక్కడకు రావడానికి అత్యంత కఠినమైన పర్వత మార్గంలో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ప్రాయాణంచేసి ఈ గుహను చేరుకుంటారు. శ్రావణ మాసపు ఆరంభంలో భక్తులు ఇక్కడకు చేరుకుని అప్పటికే పూర్తిగా ఏర్పడిన ఘనీభవించిన మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుటారు. ఈ లింగం చంద్ర కళలకు అనుకూలంగా కరుగుతూ పెరుగుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ లింగానికి ఇరువైపుల ఉన్న రెండు లింగాలాను మాతాపార్వతీ దేవి మరియు గణేశ్ రూపాలుగా భావించి ఆరాధనలు చేస్తుంటారు.
అమర్నాథ్ ఆలయానికి పయనిస్తున్న యాత్రీకులు 
ప్రస్తుత కాలం 
ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కధనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు.  బూటా మాలిక్ వాటిని తీసుకుని  ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు  పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.

  గుహాలయం 

 అమర్నాథ్ ఆలయంలోని మంచు లింగం
లిడ్డెర్ వ్యాలీ పహల్ గాం నుండి 46 కిలోమీటర్లదూరంలో, భూమట్టం నుండి 3,888 అడుగుల ఎత్తులో బాల్ తాల్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఈ అమరనాథ్ గుహ ఉంది. చార్ ధాం అని పిలువబడే వాటిలో ఒకటి అయిన అమరనాథ్ యాత్రను శ్రీనగర్ నుండి ఆరంభం ఔతుంది అయినా ఇది 96 కిలోమీటర్ల చాలా సుదీర్గమైన యాత్ర కనుక సాధారణంగా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్ వారి నుండి యాత్రకు వెడుతుంటారు.

సంప్రదాయ యాత్రా మార్గం

 

* జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారు చాలా ఉదయాన మాత్రమే వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యం ఔతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మిని బస్సులు లభ్యం ఔతాయి. లిడ్డర్ నతీ తీరం వెంట ఈ బసు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు.  సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతి వచ్చే అనుభూతికి లోను ఔతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.




* పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతస్మంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పాలకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.





యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.



యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంచానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 


* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 

* యాత్రీకులు "శ్రి ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 

* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు ఔతుంది.


యాత్రీకులు చేయవలసినవి 


* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరెలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యకు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమిన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించిన సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోడి. అయవసర సమయాలలో అది ఉపకరిస్తుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణ కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయ్ణం చేసే సమయంలో వేగించిన పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీమీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
* చందాలను డొనేషన్ బాక్సులో వేయండి.

యాత్రీకులు చేయకూడనివి 

* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మదూపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.


29, మే 2012, మంగళవారం

శ్రీనాద్ ద్వారక

శ్రీనాద్  ద్వారక 

ఉదయపురు నుండి బయలుదేరి రాత్రికి శ్రీనాద్ ద్వారక చేరుకున్నాము. మా  అందరిని హోటల్ రూములకు  చేర్చి బసును  దూరంగా పార్క్ చేసారు.   హోటల్ వారు మాకు కుంకుమ చందనము ఇచ్చి సత్కరించారు. మా యాత్రలో మమ్మిలా సత్కరించింది వీరే.   ఇది మాకందరికి అనందం కలిగించింది. అక్కడ మరొక ఆసక్తి కరమైన అనుభవం ఎదురైనది. అదేమిటంటే మా రుములకు వెలుపల ఇప్పటి మోడెం వంటి మంచాలు పరుపులు ఏర్పాటు చేసారు. అప్పటికే మా మద్య పరిచయాలు పెరిగిన కారణంగా అలా అందరం మంచాల మీద కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి అల్పాహారం ఘనంగా ఆరోజుకు తిని విశ్రాంతి తీసుకున్నాము. నిర్వాహకులు మాతో మరునాడు నాలుగున్నరకు సిద్ధంగా ఉండమని చెప్పారు. వారు చెప్పిన విధంగానే మేము సిద్దం  అయ్యాము. ఈ  ఆలయ విశేషాలు చెప్పాలి కదా.

ఆలయ విశేషాలు  

 ఈ ఆలయము బృందావనములోని నందమహారాజ ఆలయా శైలిలో నిర్మించబడింది. అందువలన దీనిని నందాభవన్ లేక నందాలయం అని కూడా పిలువబడుతుంది. ఆలయగోపురం మీద ఉన్న కలశంలో సుదర్శనచక్రంతో ఏడు జెండాలు కూడా ఎగురుతుంటాయి. ఈ ఏడు జెండాలు శ్రీకృష్ణుని ఏడుగురు సఖులకు గుర్తుగా ఉంది. ఈ ఆలయం ప్రబలంగా శ్రీనాధ్‌జీ కి హవేలి (శ్రీనాధుని భవనము) ఎందుకంటే సాధారణ ఇల్లులాగా ఈ ఆలయములో ప్రయాణించడానికి అనువుగా ఒక రధము ఉంటుంది. (ఒకవేళ శ్రీనాధ్‌జీ సింఘర్‌కు తీసుకు వచ్చిన రధము వంటిది), పాలకొరకు ఒక సామాను గది(దూద్ ఘర్), తంబూలము కొరకు ఒక సామానుగది(పాన్ ఘర్), తీపిపదార్ధాలకొరకు మరియు పంచదార కొరకు ఒక సామానుగది (మిష్రింఘర్ లేక పెదఘర్), పూలకొరకు ఒక సామానుగది(ఫూల్ ఘర్), ఒక వంటగది(ఇక్కడ వంట చేయబడుతుంది )దీనిని రసోయీ ఘర్ అంటారు, ఒక ఆభరణ శాల (ఘనాఘర్), ఒక ఖజానా (ఖర్చా భండార్), అశ్వశాల, ఒక హాలు(బైటక్), ఒక స్వర్ణ మరియు రజిత తిరగలి (చక్కి), ఈ ఆలయానికి ప్రాకారంలో మదన్ మోహన్ మరియు నవనీత్‌జీ ఉపాలయం ఉంది.

ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఏడమ చేతి చిటికెన వేలు తో గోవర్ధన గిరిని ఎత్తుతూ కుండి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆలయంలో ఉన్నది నల్లని మార్బుల్ రాతి మీద చెక్కబడిన శిల్పము. ఈ శిల్పములో శ్రీకృష్ణుడితో రెండు ఆవులు, ఒక సింహము, రెండు నెమళ్ళు, ఒక పాము మరియు ఒక చిలుక ఉంటాయి.


ఈ ఆలయానికి జన్మాష్టమికి భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి మరియు హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనము (ప్రసాదము) లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లకుల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారులు వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తీసుకు వచ్చిప్రతిష్ఠించాడు.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి మరియు అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచ, జరీ ఖండువా, రత్నఖచిత ఆభరణాలు వడుతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.

మతవిశ్వాసాలను అనుసరించి నాధ్‌ద్వరా ఆలయ నిర్మాణము శ్రీనాధ్‌జీ నిర్ణయించిన ప్రదేశంలో జరిందని భావించబడుతుంది. శ్రీనాధ్‌జీ విగ్రహాన్ని మొగలు సామ్రాజ్యా మతవ్యరేకత నుండి రక్షించి సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి బృందావనం నుండి తీసుకు వస్తూ  ఎద్దులబండిలో వస్తున్న తరుణంలో ఒక ఎద్దు కిందకు వాలింది. అలా వాలడం గమనించి వెంట వస్తున్నపూజారులు అది భగవానుడి ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణం చేయమని సూచించారు. ఈ ఆలయనిర్మిత ప్రదేశం అప్పుడు మేవార్ రాజైన రాజ్ సింగ్ పాలనలో ఉండేది. ఈ ఆలయము శ్రీనాధ్‌జీ హవేలి అని పిలువబడుతుంది.

ఆలయ దర్సనం 

 శ్రీనాద్ ద్వారక ఆలయంలో శ్రీకృష్ణుడికి విశేషమైన పూజలు ఆరాధనలు జరుగుతుంటాయి. శ్రికృష్ణుడి వైభవం అల ఉంటుంది మరి. శ్రీకృష్ణుడు నందగోపుడి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను ఎలా చూసారో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటారు. ఈ ఆలయంలో కృష్ణుడికి ఎనిమిది మార్లు పూజలు చేసి ఎనిమిది మార్లు ఎనిమిది అలంకరణలు చేసి ఎనిమిది మార్లు భక్తులు దర్శించడానికి అనుమతి లభిస్తుంది. చివరగా హారతి ఇచ్చిన తరువాత ఆలయాన్ని మూసి వేస్తారు. భక్తులు ఎనిమిది మార్లు దర్సనం చేసుకోవడానికి ఉత్సుకత చూపుతుంటారు.  అయితే మేము మాత్రం నలుగు మార్లు మాత్రమే దర్సనం చేసుకున్నాము. 

* మొదటి మారు దర్సనానికి శ్రీకృష్ణుడు దుప్పటి మూసుకుని ఉన్నట్లు ఉంటుంది. అంటే కృష్ణుడిని తెల్లవారు ఝామున లేపాలి అన్నమాట. భక్తులు అల దుప్పటి కప్పుకున్న కృష్ణుడిని దర్సనం చేసుకుంటారు. ఈ దర్శనాన్ని మంగళ దర్సనం అంటారు. ఈ సమయంలో కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. అప్పుడు మధుర గీతాలను ఆలాపన చేసి కృష్ణుడిని నిద్రలేపుతారు.
* తరువాత దర్సనం శృంగార దర్సనం. ఈ సమయంలో కృష్ణుడికి తల నుండి కాలు వరకు సుందరమైన అలంకరణ చేసి పుల మాల  వేసి అద్దంలో అయన ప్రతిబిబం ఆయనకు చూపి ఆయనను ఆనందింప చేస్తారు. అప్పుడు ఆయనకు ఖర్జూరం వంటి ఎండు ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉంటుంది . అయన వేణువును ఊది రాధను ఆనందింప చేయడానికి ఇలా చేస్తారు. 
* మూడవ దర్సనం గ్వాల్  అంటారు. ఈ సమయంలో గోశాల నుండి గోపలనాయకుడు వచ్చి కృష్ణుడికి గోవులన్నీ క్షెమమని విన్నవిస్తాడు. అప్పుడు కృష్ణుడికి వెన్నతో చేసిన మకాన్ మిశ్రి అనే పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. మేడలో పూలమాల కూడా ఉండదు. నైవేద్యం కూడా తేలికగా ఉంటుంది. అప్పటికి గోపికలు కృష్ణుడికి బలమైన ఆహారం సమర్పిచి ఉంటారు అని విశ్వసిస్తారు.
* తరువాత దర్సనం రాజభోగ్ అంటారు. ఇప్పుడు స్వామిని చాల చక్కగా వస్త, ఆభరణాలు , పూలమాల, వేణువుతో అలంకరించి చాల మచి భోజనం అనేక పదార్ధాలు కిల్లి తో సహా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దర్సనానికి ముందు ఆలయ పూజారి గోపురం ఎక్కి మాలా బేగి లాయియో  అని అరుస్తాడు. అంటే మల త్వరగా తీసుకురా అని అర్ధం. ఇలా అరవగానే అది పూజకు దర్సనానికి సంకేతంగా భావించి భక్తులు దర్శనార్ధం వస్తారు. అప్పుడు చక్కగా డ్రమ్ములు కూడా మ్రోగిస్తారు .ఈ దర్సనం తరువాత కృష్ణుడు మూడు గంటల అనంతరం సఖులతో పచ్చిక బయలులో ఆవులతో విహరించి ఇంటికి చేరుకుంటాడు కనుక మద్యలో దర్సనం ఉండదు.
* ఈ దర్శనాన్ని ఉత్తపాన్ అంటారు. కృష్ణుడు తన సఖులతో గువులను తోలుకుని ఇంటికి చేరిన సమయం ఇది. సాయంత్రం మూడున్నర గంటలకు ఈ దర్సనం ఉంటుంది. ఇప్పుడు విన మిద కీర్తనలు ఆలపిస్తారు.
* ఉత్తాపన దర్సనం  తరువాత ఒక గంట తరువాత అరవ దర్సనం అయిన భోగ దర్సనం ఉంటుంది.  ఇప్పుడు స్వామి తలపాగా, నడుముకు మెరిసే స్కర్ట్ , చేతులకు , ఆభరణాలు , పతకము   అలంకరణతో కనిపిస్తాడు. కృష్ణుడికి అల్పాహారం నైవేద్యంగా సమర్పిస్తారు. చామరం వీచి  దిష్టి తీస్తారు. 
*  సంధ్య హరతి అంటే సాయంత్రం  దర్శనం. ఈ దర్శనం మునిమపు వేళలో ఉంటుంది. ఇప్పుడు క్రుష్ణుడు వస్త్త్ర ధారణ తేలికగ ఉంటుంది. రోజంత శ్రమించిన తరువత విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సుదర్సన చక్రం పైకప్పు మీద ఉంచబడుతుంది. క్రుష్ణుడి ఏడుగురు గోపాల సఖుల గుర్తుగా ఉన్న ఏడు ధ్వజాలు మరునాటి ఉదయం వరకు చుట్టి ఉంచుతారు. రాత్రి ఆహరం నైవేద్యంగా సమర్పించి హరతి తీసి దర్సనం ముగిస్తారు. 
*  ఇది రోజులో ఆఖరి దర్శనం ఇప్పుడు పూజారి మిద్దె మీద నిలబడి వంటమనిషిని పిలిచి రేపు త్వరగ రమ్మని చెప్తాడు. తరువత కృష్ణుడు నిద్రించే సమయం. క్రుష్ణుడికి వివిధమైన ఆహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. మధురమైన కీర్తనలను ఆలపిస్తారు. తాంబూలం నైవేద్యంగా సమర్పిస్తరు.  తరువత క్రుష్ణుడి పడకటింటిని సిద్ధం చేస్తారు. ఒక పత్రలొ ఆహారం, జలపత్రలో మంచి నీరు, కిల్లీలు పక్కన ఉంచుతారు, రాత్రి వేళలో రాధా రాణి కృష్ణుడిని సేవించడానికి వస్తుందని ఆమె దుస్తులు మరియు ఆభరణాలను పక్కన ఉంచుతారు. పడకటింటి వరకు కార్పెట్ పరచి కృష్ణుడి మందిరంలో భక్తులు దర్శనార్ధం ఉంచిన చెక్కల అడ్డాలను తొలగిస్తారు. భక్తులను ఎండ నుండి కాపాడటానికి ఉంచిన చత్రలను సైతం తొలగిస్తారు. శ్రీనాధుడు  నిరాటంకంగా గోపికలతో విహరించ్డానికి అనువుగా ఇటువంటి మార్పులను చేపడతారు. ఈ దర్శనం చిత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుండి ఆశ్విజమస శుక్లపక్ష నవమి వరకు ఉండదు. అప్పుడు క్రుష్ణుడు వ్రజభూమికి వెళతాడని ఈ దర్శం ఆపివేస్తారు. క్రుష్ణుడు ఆసమయాన్ని వ్రజవాసులకు కేటాయిస్తాడు. 


మేము ఉదయపు రెండు దర్శనలను చూసి మద్యలొ కంగ్రోలి ద్వరకకు పక్కనే వెళ్ళి తిరిగి వచ్చి మద్యాహ్న భోజనాలు చేసి. సాయంత్రం నాలుగు గంటల నుండి రెండు దర్శనలు చూసి హోటల్ రూములకు చేరాం. సాయంత్రవేళలో ద్రమ్ములు వాయించడం అక్కడి ఆనందకరమైన ఏర్పాట్లు మమ్ము చలా ఆకర్షించాయి.. మునిమాపు వేళలో ఆరతి దర్శనం సమయంలో కొందరు గోపాలకుల వేషంలో, కొందరు గోపికల వేషంలో ఆలయంలో నిలిచి ఉన్నారు. ఈ వాతావరణం నిజంగా నందగోకులంలో ఆ సమయంలో ఇలా ఉండేదేమో అనిపించేలా చేసింది. దర్శనసమయాలలో భక్తులు విపరీతంగా తోపిడికి గురి చేస్తారు. గోపికలు ఇలా శ్రీకృఇషుడి చెంతకు చేరతారు కబ్నుక్,అ ఆయనను ఇలానే దర్శనం చేయాలని వారి అభిమతమట. ఏది ఏమైనా శ్రీనాధ్ ద్వరక దర్శనం మాకు ఆనందాన్ని వింత అనుభూతిని కలుగ చేసింది. అవకాశం ఉన్న వారు ఎనుమిది దర్శనలు చేస్తారని నిర్వహకులు చెప్పారు. ఒక్కో దర్శనం ఒక వైవిధ్యమైనది కనుక అలాచేస్తారట. 

మరునాడు శ్రీనాధ్ ద్వరకనుండి మేము బయలుదేరే సమయంలో హోటల్ వారు మాకు శ్రీనాధుడి చిత్రపటాలను కనుకగా ఇచ్చి సాగనంపారు. హోటల్ వారి అతిథి సత్కారం కూడా మమ్ము మరింత ఆనందింపచేసింది మరి. చక్కటి అనుభూతిని మనసులో మిగుల్చుకుని మేం   శ్రీనాధ్ ద్వారక విడిచాము. 


24, మే 2012, గురువారం

ఉదయపూరు



ఉదయపూరు


ఉదయపూరు కోట ద్వారం 

అబూ పర్వతం చూసిన తరువాత మరునాటి  ఉదయం బయలుదేరి ఉదయపూరు చేరాం . మా యాత్రలో ఉదయపూరు నిర్వాహకులు  లేకున్నా సమయం ఉన్నందు వలన మాకు అదనంగా చూపిస్తున్నామని చెప్పారు.  ఉదయపూరులో నిర్మాణాలు చాలా వరకు తెల్లగానే ఉన్నాయి. 
ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం(సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయపూర్ రాజధానిగా ఉండేది. . ఈ నగరాన్ని తూర్పు వెనిస్ నగరం, ప్రేమ నగరం మరియు సరస్సుల నగరం అని
 ఉపనామాలు ఉన్నాయి. మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని  ఆరావళి పర్వత పాద పంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించాడు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో నిండి ఉంటుంది ఉదయ్ పూర్.
 గైడు మాకు  ఉదయపూరును శ్వేతనగరం (వైట్ సిటి) అని అంటారు అని చెప్పాడు. ముందుగా ఉదయపూరు కోట చూసాము. కోటలో ప్రవేశించడానికి టిక్కెట్ కొనుక్కుని లోపలకు వెళ్ళగానే విశాలమైన ప్రాంగణం మమ్ము ఎంతో ఆకర్షించింది. 
ఉదయపురు కోటలో విశాలమైన ప్రాంగణం 

లోపలకు వెళ్ళిన తరువాత రాజప్రాసాదం లోకి ప్రవేశించి అక్కడ కొన్ని చిత్రాలను  చూసాము.  వాటిని ఫోటో తీయడానికి మాకు అనుమతి లేదు కనుక ఫోటోలు తీయలేక పోయాము. మాకు తెలియక కొన్ని పొటోలు తీసిన తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటి సూచన మేరకు కెమెరాలను అక్కడ ఒప్పగించి ముందుకు సాగాము.  లోపల రాజభవనం చాల ఆకర్షనీయంగా  ఉన్నాయి. కోటను దర్సించిన ఆనందంతో వెలుపలకు వచ్చి బస్సు ఎక్కి ముందుకు సాగాము. 
ఉదయపురు రాజవంశం 
ఉదయపురు రాజ చిహ్నము సూర్యభగవానుడు 
వ్యాఖ్యను జోడించు
ఉదయపురు రాజసభ

మద్యాహ్న భోజనాలు అనంతరం  హల్దీఘాట్  చూడడానికి వెళ్ళాము. ఇక్కడ రాజా ప్రతాప్ సింగ్ మొగల్ సేనల సాయంతో దండెత్తి వచ్చిన రాజమాన్ సింగ్ తో యుద్ధం సాగించిన ప్రదేశం.  ఇక్కడ 
రాజా ప్రతాప్ సింగ్ ప్రియతమ అశ్వం చేతక్ యుద్ధంలో తన రెండు కాళ్ళను కోల్పోయిన తరువాత కూడా సాహసంతో  రాజా ప్రతాప్ సింగ్ ను నదిని దాటించి తన ప్రాణాలను విడిచి త్యాగం ప్రదర్శించిన పవిత్ర ప్రదేశం ఇదే. చేతక్ ప్రాణత్యాగం చేసిన ఈ  ప్రదేశంలోరాజా ప్రతాప్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించాడు.  ఇక్కడి ప్రజలు చేతక్  సాహసాన్ని చాల అభిమానిస్తారు.  తమ అభిమానానికి గుర్తుగా ఇక్కడ తాయారు చేయబడుతున్న ద్విచక్ర వాహనాలకు  చేతక్ అని నామకరణం చేసి గర్వపడుతున్నారు.  గైడు చెప్పిన ఈ సంఘటన మా హృదయాలను కదిలించింది.

హల్దీ ఘాట్ చుసిన తరువాత సహేలియోకి భారి చూడడానికి వెళ్ళాం .  సహేలియోకి భారి అంటే చెలికత్తెల పూదోట . రాణి చెలికత్తెలు 48 మంది నిరాహార దిక్ష ఫలితంగా వారి విహారం కొరకు ఈ  పూల తోట  నిర్మాణం జరిగింది. చెలికత్తెలు తమకు విహారానికి తగిన ప్రదేశం లేదని చింతిస్తున్నారని తెలుసుకుని మహారాజు ఈ మనోహర పులతోటను నిర్మించి  వారికి  కానుకగా ఇచ్చాడు. ఈ తోటలో  బరిష్ గార్డెన్ , బర్డ్ గార్డెన్ , హథీ గార్డెన్,  లోటస్ గార్డెన్,  హోలీ గార్డెన్ అనే విభాగాలు ఉన్నాయి.  బారిష్ గార్డెన్ లో నీటి ఫౌంటెన్ సాయంతో వర్షం కురుస్తున్న శబ్దం వినిపించే ఏర్పాటు చేసారు. హథీ గార్డెన్ లో గంభీరమైన పాలరాతి ఏనుగు శిల్పాల నోటి నుండి నీరు చిమ్మే ఏర్పాటు చేసారు.
లోటస్ గార్డెన్ లో తామర కొలను ఏర్పాటు చేసారు.   బర్డ్ గార్డెన్ లో నీటి సాయంతో పక్షుల కిలకిలారవం విపించే ఏర్పాటు చేసారు. హోలీ గార్డెన్ లో హోలీ పాడుగా జరుపుకుంటారు.
సహేలియోకి భారి ప్రవేశ ద్వారం 



పక్షుల తోట 

హథీ గార్డెన్ 

హోలీ గార్డెన్ 

కొలను మధ్యలో శకుంతల మడపం 
సహేలియోకి భారి చుసిన తరువాత ఏక లింగేశ్వర ఆలయం చూడడానికి వెళ్ళాం.  ఏక లింగేశ్వర ఆలయం ఉదయపూరులో  తప్పక చూడవలసిన ఆలయాలలో ఒకటి. ఆలయం రాజ గంభీరంగా ఉంది. ఇక్కడ రాజ కుటుంభం వారు ఈశ్వర ఆరాధన చేస్టారు కనుక ఆలయం అంత రాజ గంభీరంగానే ఉన్నది.  గర్భాలయంలోని ఈశ్వరుడికి  నాలుగు ముఖాలు ఉంటాయి. బ్రహ్మ,విష్ణు  , మహేశ్వరుడు వారితో  నాలుగవ ముఖంగా రాజకుటుంబ ఆరాధ్య దైవం అయిన సూర్యుడు ఉంటారు.  అలయదర్సనం నిజంగా మానసిక ఆనందాన్ని కలిగించింది. ఇలా మా ఉదయపురు సందర్శనం మాకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది.      




8, మే 2012, మంగళవారం

అబూ పర్వతం


  

 అబూ  పర్వతం


1898 లో అబూ పర్వతం





మేము బస చేసిన హోటల్ ఇదే 


అబూ పర్వతంలో  బ్రహ్మకుమారిల ప్రధాన కార్య లయం ఉంది.  గుజరాతీయులకు రాజస్తాన్ ప్రజలకు ఇది వేసవి విడిది. ఇక్కడి ప్రజలు కేవలం పర్యాటకుల మీదనే ఆధారపడి జీవిస్తారు. వీరికి మరో జీవనోపాధి లేదని ఇక్కడి గైడు చెప్పాడు. ఇక్కడికి అత్యధికంగా గుజరాతీయులు వస్తారని గుడు చెప్పాడు.  విదేశా ల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.  అరవాలి పర్వతాలలో ఉన్న  ఈ ప్రదేశం వేసవి విడిదిగా పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. 


అంబాజీ నుండి బయలుదేరి సాయం సమయానికి ముందే అబూ పర్వతానికి చేరుకున్నాము.  బసకు చేరిన వెంటనే  సేదతీర్చుకుని ఉత్సాహంగా సూర్యాస్తమయ దృశ్యం చూడడానికి బసులో ప్రయాణం అయ్యాము.  సూర్యోదయ దృశ్యం చూసే ప్రదేశానికి చేరాలంటే బసుదిగి  రెండు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది.   అక్కడ నుండి వెళ్ళడానికి ప్రత్యేకమైన చిన్న బండ్లు ఉన్నాయి. ఆ బండ్లలో వారు నలుగురిని ఎక్కించుకుని తీసుకు వెళ్లి తిరిగి తీసుకు వచ్చి వదిలి వెడతారు. దానికి కొంత రుసుము చెల్లించాలి.  వారి వద్ద కొంత జాగ్రత్తగా బేరం మాట్లాడి ఒక్కో బండిలో ఇద్దరం మాత్రమే వెళ్ళాం. ఆ బండ్లను ఇద్దరు నెట్టుకు తీసుకు వెడతారు.  మానవ ప్రయత్నంతో మానవ శక్తితో మాత్రమే వాటిని నడుపుతారు. అ బండ్లలో మా ప్రయాణం ఆసక్తి కరమైనది. ఆ బండ్ల మిద ఉన్న నంబరును గుర్తు పెట్టుకుని తిరిగి అదే బండిలో ఎక్కాలి.  మనుషులు నడిపే బండిలో ఎక్కాలంటే కొంత బాధ అనిపించింది. అక్కడకు వెళ్ళడానికి అది ఒక్కటే మార్గం కనుక ఎక్కక తప్పలేదు .
సూర్యాస్తమయ దృశ్యానికి మమ్ము చేరవేసిన బండి ఇదే 

 ఇలాంటి అ బండి ఎక్కి సుర్యాస్తమయ దృశ్యం చూసే ప్రదేశం చేరాం. అప్పటికే అక్కడ కాల మంది చేరారు. అబూ పర్వతంలో  సూర్యా స్తమయం  ఒక ప్రత్యెక ఆకర్షణ. వీక్షణం  చేయడానికి ఉన్న కేంద్ర స్థానానికి చేరం.  మేము మర్గమద్యంలో కొన్న తినుబండారాలను తింటూ ముచ్చట్లు చెప్పు కుంటూ సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసి ఆనందించాము.
అబూ పర్వతం వద్ద  సూర్యాస్తమయ దృశ్యం విక్షిస్తున్న ప్రేక్షకులు

ఇలా సూర్యాస్తమయ దృశ్యం చూసి ఆనందంగా మా మా బండ్లలో వేనుతిరిగాము.  ఆరోజుకు బసకు చేరుకుని యధా విధిగా రాత్రి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నాము.  మరుసటి రోజు అబూ పర్వతంలో ఉన్న బ్రహ్మకుమరిల ఆశ్రమం చూడడానికి వెళ్ళాము. ఆశ్రమ ప్రాంగణం ప్రశాంతంగా  ఉంది. విశాలమైన మెట్లు ఎక్కి లోపలకు చేరగానే మమ్మల్ని మా భాష గురించి  విచారించి లోనికి పంపి అసీనులను చేసారు.  అప్పుడు తెలుగులో మాట్లాడే ఒక బ్రహ్మకుమారి వచ్చి తనను పరిచయం చేసుకుని తెలుగులో ప్రసంగం చేసింది. ఆమె ప్రసంగం చాలా బాగుంది. విన్నంత సేపు మమ్ము మంత్రముగ్ధులను చేసింది. ప్రసంగం విని వెలుపలికి వచ్చి అంతా తిరిగి చూసి పుస్తక విక్రయశాలలో పుస్తకాలను కొనుగోలు చేసి వెలుపలికి వచ్చాము.
బ్రహ్మకుమారి మందిరం ఇదే


బ్రహ్మకుమారి మందిరం చుసిన తరువాత మేము బసులో వెళ్లి  అర్భుతాదేవి మందిరం వద్దకు చేరుకున్నాము.
File:Hanuman Statue, near Arbuda Devi Temple, Mount Abu, Rajasthan.jpg


 అర్భుతదేవి మందిరానికి వెళ్ళాలంటే 400 మెట్లు ఎక్కాలి అని చెప్పారు. మాలో కొందరు మాత్రమే ఆ ఆలయానికి వెళ్లారు. అర్భుతాదేవి మందిరం కారణంగా ఈ పర్వతానికి ఈ పేరు వచ్చింది.
ఇది అర్భుతదేవి ఆలయానికి పోయే ప్రవేశ ద్వారం ఇక్కడి నుండి 400 మెట్లు ఎక్కాలి

ఆలయ దర్సనం చేసుకుని వచ్చిన వారు వచ్చే వరకు అక్కడ ఎదురుచూసి తిరిగి మిగిలిన ప్రదేశాలు చూడడానికి వెళ్లాం.
File:Mount Abu Jain-Temple ca1898.jpeg
ఇదే అద్భుతమైన శిల్ప వైభవం కలిగిన జైన మందిరం 
అక్కడ నుండి మేము ఒక జైన మందిరాన్ని చూడడానికి వెళ్ళాము.  ఆ ఆలయాన్ని ముస్లిం పాలకులచేత  కొంత ధ్వంశం చేయబడింది.  ఆలయ శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. కానీ కొన్ని శిల్పాలకు ముక్కు మొదలైన అవయవాలు విరగకొట్టారు. వాటిని ప్లాస్టర్ ఆఫ్  పారిస్ తో  సరి దిద్దారు.  ఆలయంలో మహావిరుడి విగ్రహాలు చాల బాగున్నాయి. మధ్యాహ్న సమయం అయింది కనుక తిరిగి బస చేరాము.  భోజనాలు అయిన తరువాత కొంత విశ్రాంతి తీసుకుని అలా నడుస్తూ అబూ సరసు చూడడానికి వెళ్ళాము.  సరసులో పడవ లలో ఎక్కి సందర్సన చేసాం.
అబూ సరసులో సుందరమైన పడవలు ఇవిగో

పడవలలో ప్రయాణం చేసే సమయంలో మమ్మలిని పడవ వారు సరసులోని చిన్న ఆలయం వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ చిన్న వినాయకుని విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.  అక్కడ స్వామి వారికీ కొన్ని కానుకలు ఇచ్చుకుని తిరిగి పడవల ముందుకు కదిలాము.  ఇది పడవలలో  కుర్చుని చేసాము.
సరసు మద్యలో వినాయకుడి గుడి ఇదే  పక్కన ఉన్న బండల పైన  పక్షులు  కూడి సందడి చేస్తుంటాయి.
                
సరసు నుండి వెలుపలికి వచ్చి మేమంతా అబూలో లభించే వస్తువులను కొనుగోలు చేసాం. ఇక్కడి ఎంపోరియం చాలా అందంగా ఉన్నది.  అక్కడ మా వాళ్ళు చాలా వస్తువులు కొనుగోలు చేసారు.  ఇలా అబూ యాత్ర ఆహ్లాదంగా ముగించి బసకు చేరి విశ్రాంతి తీసుకున్నాము.


అంబాజీ

అంబాజీ
అంబాజీ ఆలయ ముఖద్వారం 
మాతృ గయలో శ్రాద్ధకర్మలు ఆచరించిన తరువాత నిర్వాహకులు మాకు షడ్సోపెతనమైన భోజన ఏర్పాట్లు చేసారు.  మాములుగా శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పాయసం, గారెలతో ప్రత్యెక భోజనం ఏర్పాటు చేస్తారు కదా అలాగే  మాకు చేసారు నిర్వాహకులు.  భోజనాలు చేసి మేము  అక్కడి నుండి మేము బసులో సాయంత్రానికి బయలుదేరాము.  సాయం సమయానికి 6.30 సమయానికి అంబాజీ చేరాము.  అంబాజీలో సూర్యాస్తమయం చూడాలన్న ఏర్పాటు గదుల ఏర్పాటులో జరిగిన అస్తవ్యస్త పరిస్తితుల వలన మారి పోయింది.  కొంచెం ఆలస్యంగా ఆలయానికి వెళ్ళాము.  అంబాజీ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం ప్రధానంగా  ఈ  ఉరు రూపుదిద్దుకున్నది.  ఆలయం చాల విశాలంగా  ఉంది.  శిల్పకళ  కూడా  మెచ్చ తగినదిగా  ఉంది.

అంబాజీ ఆలయం ఆరావళి పర్వతసానువుల్లోని గబ్బారు కొండ మీద ఉన్నది. ఇది పురాణ ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం. సతీదేవి హ్రదయం పడిన ప్రదేశం ఇది.  ఈ ఆలయంలో దేవిని ఉపాసిస్తారు.  లోపలకు వెళ్లి అమ్మవారి దర్సనం చేసుకుని అల వెలుపలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రసాదం కొనుగోలు చేసాం.  ప్రసాదంతో ఒక చిన్న వర్ణ వస్త్రాన్ని ఇస్తారు. భక్తులు దానిని మేడలో మాల మాదిరిగా ధరిస్తారు. గుజరాతులో చాలా ఆలయాలలో ఇవి ఇస్తారు. ఆలయంలో దేవి నాణేలను కూడా భక్తులు కొనుగోలు చేస్తారు. వీటిని దానం భద్రం చేసుకునే ప్రదేశాలలో పెట్టితే మంచిదని  నిర్వాహకులు చెప్పారు.  అందరు వీటిని కొనుగోలు చేసారు. ఒక్కోటి 25 రూపాయలు.  ఇలా మా దర్సనం  ముగించుకుని వెలుపలికి వచ్చాం. ఆలయ ప్రాంగణంలో  ఉన్న దుకాణాలలో కొన్ని దేవుని చిత్రం వంటి వస్తువులను కొనుగోలు చేసి మా బసకు చేరుకున్నాం. 

మరునాటి ఉదయం గబ్బర కొండ శిఖరం పైన  ఉన్న దేవి దర్సనానికి  వెళ్ళాం. అక్కడకు చేరుకోవడానికి కేబుల్ కార్లు ఉన్నాయి. మెట్లదరిలో కూడా చేరుకోవచ్చు. అయినా 999 మెట్లు ఎక్కాలి. ఆసక్తి కరమైన కేబుల్ కార్లను వదిలి మెట్లదారిలో పోవడానికి ఎవరు మొగ్గు చూప లేదు. పైగా మాకు సమయం కూడా లేదు మరి. కొండ శిఖరం చేరుకుని అమ్మవారి దర్సనం చేసుకున్నాం. అక్కడ అమ్మవారు శ్రీ చక్రం  మాత్రమె. శ్రీ చక్రం ముందు ఒక అఖండ దీపం వెలుగుతుంది. భక్తులు ఆ దీపానికి నమస్కారం చేసుకున్నారు. అమ్మవారి దర్సనం చేసుకున్న తరువాత అదే కేబుల్ కార్లలో కిందకు దిగాం.  అక్కడ పప్పెట్ ప్రదర్సన చేసే వారు మమ్ము ఆహ్వానించారు. అందరం ప్రదర్సన చూసి మాకు తోసినది ఇచ్చాం.  ఇలా అంబాజీ దర్సనం పూర్తీ చేసుకుని బసకు చేరుకుని భోజనాలు చేసి అక్కడికి సమీపంలో ఉన్న అబూ పర్వతానికి  ప్రయాణం సాగించాము.  


  

6, మే 2012, ఆదివారం

మాతృ గయ

ఇదే బిందు సరోవరం 

సిద్ధిపురు నుండి ఉదయం స్నానాదికాలు పూర్తీ చేసుకుని బయలు దేరి బిందు సరోవరం చేరుకున్నాము.  బిందు సరోవరం అంటే కపిల మహర్షి జన్మించిన ప్రదేశం. కపిల మహర్షి విష్ణుమూర్తి అంశ  అవతారాలలో ఒకడు. కర్ధర్మ ప్రజాపతి దేవభూతి తపసుకు మెచ్చి ప్రత్యక్షమైన విష్ణుమూర్తికి కర్దమ ప్రజాపతిని చూడగానే కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి ఆ ఆనంద భాష్పాలు పడిన ప్రదేశంలో సరోవరమగా ఏర్పడింది. అదే బిందు సరోవరం.  విష్ణుమూర్తిని ఆ దంపతులు విష్ణుమూర్తి వంటి కొడుకును ఇవ్వమని కోరగా విష్ణుమూర్తి  వంటి కొడుకు కావాలంటే నేనే మీకు కొడుకా జన్మించాలి  అని చెప్పి  విష్ణుమూర్తి వారికి కుమారుడిగా జన్మించాడు.  అతడే కపిల మహర్షి. అయన  పుట్టగానే కర్దమ ప్రజాపతి   తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. కపిల మహర్షి తన తల్లి దేవభుతికి సాంఖ్యజ్ఞానం ఉపదేశించి ఆమెకు జ్ఞానం కలిగించి ఆమె దేహత్యాగం చేసిన తరువాత ఆమెకు శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. ఇక్కడ పరసుశు రాముడు తనతల్లికి  శ్రద్ధ కర్మలు ఆచరించాడు.  ఈ  కారణంగా  ఇక్కడ మాతృ మూర్తికి మాత్రం శ్రద్ధ కర్మలు ఆచరిస్తారు.  స్త్రీలు కూడా ఇక్కడ శ్రద్ధ కర్మలు ఆచరిచ వచ్చు.  ఇక్కడ ప్రత్యెక రుసుము తీసుకుని కావలసిన ద్రవ్యములు వారె సరఫరా చేసి శ్రద్ధ కర్మ నిర్వహించ చేస్తారు.
శ్రాద్ధ  కర్మ ఆచరిస్తున్న స్త్రీ పురుషులు 
  

బిందు సరోవరం  చెంత నీటిని  చల్లుకుని పవిత్రం చేసుకుని తరువాత శ్రాద్దకర్మ చేసే ప్రదేశానికి వెళతారు. బిందు సరోవరంలో స్నానం ఆచరించడానికి కావలసిన నీరు సరోవరంలో లేదు కనుక స్నానం చేయడానికి వీలుపడదు.  ముందుగా విష్ణుమూర్తిని పచ్చి వక్కలో ఆవాహన చేయించి. ఆయనకు షోడశోపచార పూజ నిర్వహించి తరువాత 27  పిండములు  చేయించి ఒక్కో విధమైన కృతజ్ఞత చెప్తూ ఒక్కో పిండము  సమర్పిస్తూ శ్రద్ధ కర్మ నిర్వహణ చేయిస్తారు. వారు వివరిచి చెప్పే విధం మనసును తల్లి పట్ల కృతజ్ఞతా భరితం చేసింది. పురోహితులు హిందిలో మాత్రమే వివరణ చేస్తారు. ఇలా తల్లికి శ్రాద్దకర్మ ఆచరించడం ఒక వింత అనుభూతిని అనందం కలిగించింది. పురోహితులకు వస్త్రలను కాని వాటికి బదులుగా ధనమును కానీ వారి ఇష్టాను సారం ఇవ్వ వచ్చు.  మాతృ శ్రాద్ధం కనుక చీరలను కూడా ఇవ్వ వచ్చు.  ముందుగా తెలిసిన వారు తమ వెంట తీసుకు వచ్చిన వస్త్రాలను దానం చేసారు. మిగిలిన వారు దానం ఇచ్చారు.  చివరగా పురోహితులకు దక్షిణగా అందరు ప్రత్యెక రుసుము చెల్లించాలి. దీనిలో మినహాయింపు లేదు. శ్రద్ధ కర్మ పూర్తీ చేసి పక్కనే ఉన్న దేవభూతి బొమ్మ ఉన్న వృక్షానికి నమస్కరించిన తరువాత శ్రద్ధ కర్మ పూర్తీ  అయినట్లే. తరువాత ఆలయ ప్రాంగణం లోని పరశురాముని దర్శించుకుని.  అలాగే లోపల ఉన్న కర్దమ ప్రజాపతి, దేవభూతి , కపిలమహర్షి ఆలయాలను దర్శించిన తరువాత ఆలయం వెలుపల నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఉపాహారం తీసుకున్నాము.  ఇలా మాతృగయ యాత్ర పూర్తీ చేసుకున్నాము. విష్ణుమూర్తి,  కర్దమ ప్రజాపతి,  దేవభూతి,  పరశు  రాముడు పాదములు పడిన ప్రదేశంలో మేము నడిచాం అన్నది మాకు పరవశం కలిగించింది.  ఇలా మాతృ గయ యాత్ర   పూర్తీ అయింది.  

ప్రభాస తీర్ధం సోమనాద్


ప్రభాస తీర్ధం  సోమనాద్ 

మేము మరునాడు ఉదయం తెల్లవారు ఝామున తయారై మేము బస చేసిన హోటల్ సమీపంలో ఉన్న ప్రభాస తిర్దానికి ఆటలలో వెళ్ళాం. అక్కడ మూడు నదులు సంగమిస్తాయి. నది సంగమం కనుక అది పవిత్ర క్షేత్రం. భారతంలో ఈ  క్షేత్రం  పలుమార్లు ప్రస్తావన చాలా మార్లు చేయబడినది.  అర్జునుడు తీర్ధయాత్రా చేసినప్పుడు ఒక సారి పాండవులు మహాప్రస్థానం వెళ్ళినప్పుడు ఒక సారి నారదుడు తీర్ధ యాత్రల గురించి ధర్మరాజుకు వివరానా చేసినప్పుడు ఇలా అనేక మార్లు ఇది ప్రస్తావన చేయబడినది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ యాదవకుల పరిసమాపతి జరిగింది. శ్రీకృష్ణుడు ఇక్కడ నిర్యాణం చెందాడు. ఇన్ని రోజుల తరువాత కూడా ఆ ప్రదేశం సందర్శన మాకు కొంత విషాదం కలిగించినది.  మనో భారంతోనే ఆ ప్రదేశం సందర్శన చేసాం. అక్కడ  ఇంకా చీకటి తొలగక ముందే అక్కడి ఆలయ సముదాయాలను చూసాం. మాలో కొందరు సంగమంలో పసుపు కుంకుమ లను రావికతో సహా సమర్పించారు. నేమేము ఆ ఏర్పాటుతో రానందుకు కొంత బాధపడిన మాట వాస్తవం. చేయలేని వారందరూ నిర్వాహకులను ముందుగా ఎందుకు చెప్పలేదని అడిగారు. లేత చీకటిలో త్రివేణి సంగమ  దర్సనం మంచి అనుభూతిని కలుగ చేసింది.  
తిరిగి బసకు చేరుకుని సోమనాధ ఆలయానికి తిరిగి వెళ్లాం.  ఈ సారి పాత ఆలయం చూసాం. భుగర్భం  లో ఉన్న ఆలయంలోని  శివుడిని వెనుక ఉన్న చంద్రుడిని చూసాం. ఇక్కడ చంద్రుడు నల్ల రాతితో చేయబడి ఉన్నాడు. ఆలయంలో ఉన్న శివుడికి భక్తులు అందరు స్వయంగా పాలతో  అభిషేకం చేయవచ్చు.  మేమంతా అక్కడ విక్రయిస్తున్నా పాల పాత్రలను తీసుకుని శివునికి అభిషేకం చేసి ఆనందించాము.  తిరిగి బస చేరుకుని ఫలహారులు తిని సిద్ధిపూరు ప్రయాణం ఆరంభం చేసాం. 
తిరిగి బసులో మా ప్రయాణం కొనసాగింది. మద్యలో మూలా ద్వారకను చూసి తరువాత మద్యాహ్న భోజనాలు చేసాం.  ఆ ప్రదేశం చాల బాగుంది కనుక భోజనం చేసి మా వయసులు మరచి ఉయ్యాలలు తూగుటుయ్యాలలు జారుడు బండలు ఆ డాము.


తరువాత వాల్మీకి మహర్షి రామాయణం రచన చేసిన  ప్రదేశం చూసాం.  పురాణ ప్రసిద్ధి చెందిన ప్రదేశం చూసినందుకు ఆనందం కలిగింది. అలాగే కంచి మత నిర్వహణ చేస్తున్న కామాక్షి  ఆలయాన్ని దర్సన చేసాం.  ఆ ఆలయంలోని ప్రాకారంలో ఉన్న  అనేక శక్తి స్వరూపాలను కూడా చూసాం.  ఆ ఆలయంలో తమిళ పూజారులను చూసి దక్షిణ  భారతదేశ  అనుభూతికి లోను అయిన మాట వాస్తవం. ఆ తరువాత ప్రయాణించి రాత్రి 12 గంటలకు సిద్ధిపూరు చేరుకున్నాము. ఆ వూరు చిన్నది కనుక మాకు అందరికి ఒకే హోటలులో గదులు చిక్కలేదు. అర్ధరాత్రి మా మా గదులకు చేరడానికి బాగా అవస్థ పడ్డాము.  కొన్ని గంటలు కాలిలో ఎదురు చూసి మెల్లిగా మా గదులకు చేరి నిద్రపోయాము.  తెల్ల వారు ఝామున నిద్ర లేచి వెళ్ళాలని తెలుసుకుని మాలో కొందరు కొంత నిరసపడ్డ మాట వాస్తవమైనా శ్రమ పడకుండా కొత్త ప్రదేశాలు చూడలేము కదా అని సరి పెట్టుకున్నారు. కానీ మరునాటి ప్రదేశం ఆసక్తి కరమైనది.